తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు వరకు ఆమెకు ఇక్కడ హిట్టే లేదు. అయినా సరే అవకాశాలకైతే లోటు లేదు. తొలి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ అయినా.. ఆ తర్వాత చేసిన కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా కూడా నిరాశపరిచినా.. తమిళంలో నటించిన ‘కాంత’ కూడా ఫ్లాప్ అయినా.. ఆమెకేమీ అవకాశాలకు లోటు లేకపోయింది.
ఇలాంటి టైంలో ‘లెనిన్’ సినిమా ఆమెకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ చిత్రం భాగ్యశ్రీ కోరుకున్న విజయాన్ని అందించేలా ఉంది. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ సక్సెస్ మీట్లో ఆమె ఎంత ఎమోషనల్ అయిందో తెలిసిందే. హిట్ లేనపుడే భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదు. ఇక ఆ లోటు కూడా తీరిందంటే ఆమె మరింతగా దూసుకెళ్లడం ఖాయం.
ఇదిలా ఉండగా ‘లెనిన్’ సక్సెస్ నేపథ్యంలో ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న భాగ్యశ్రీ.. సినీ రంగంలోకి రావడానికి ముందు తన నేపథ్యం, కుటుంబ విషయాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. భాగ్యశ్రీని చూస్తే బాగా రిచ్ అనిపిస్తుంది కానీ.. చిన్నతనంలో ఆమెది సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబమట. అలాంటి కుటుంబాల్లో ఉండే ఆర్థిక ఇబ్బందులను తానూ అనుభవించినట్లు ఆమె చెప్పింది. తమది మహారాష్ట్ర అని.. తాను పుట్టిన కొంత కాలానికే తండ్రి ఉద్యోగం పోయినట్లు ఆమె వెల్లడించింది.
తనకు ఇద్దరు కూతుళ్లున్నారని, ఏదైనా జాబ్ ఇప్పించమని తన తండ్రి చాలామందిని అడగడం తనకు గుర్తుందని ఆమె చెప్పింది. అది చూశాక పెద్దయ్యాక తాను బాగా డబ్బులు సంపాదించి తండ్రికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అనుకున్నట్లు భాగ్యశ్రీ పేర్కొంది. కొన్నేళ్ల తర్వా తన తండ్రికి నైజీరియాలో ఉద్యోగం వచ్చిందని.. తన కుటుంబం అక్కడికి వెళ్లామని.. అప్పుడు తనకు మరాఠీ తప్ప ఇంగ్లిష్ రాదని.. దీంతో అక్కడున్న ఎన్నారైలు బాగా ఏడిపించేవారని ఆమె వెల్లడించింది.
This post was last modified on July 12, 2026 3:08 pm
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…