ఇండియన్ క్రికెట్ లో తనదైన సంతకం చేసిన వాళ్లలో సౌరవ్ గంగూలీది ప్రత్యేక స్థానం. ఆటలోనే కాదు బయట కూడా దూకుడుగా ఉండే అతని శైలి అంత సులభంగా కొరుకుడు పడదు. ఎవరైనా ఫాలో చేయడానికి ట్రై చేసినా పనవ్వదు. అలాంటి లెజెండరీ క్రికెటర్ జీవితం తెరకెక్కబోతోంది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మే 14 అన్ని ప్రధాన భాషల్లో సినిమా విడుదలవుతుందని టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది.
లార్డ్స్ మైదానంలో మ్యాచ్ గెలిచాక గంగూలీ చొక్కా విప్పి విజయ గర్వంతో అరిచిన స్టిల్ నే పోస్టర్ కోసం వాడారు. రాజ్ కుమార్ రావు టైటిల్ రోల్ పోషిస్తుండగా మూవీకి ‘దాదా’ అనే టైటిల్ నామకరణం చేశారు. అయితే ఈ ప్రాజెక్టుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే మీద ఉంది. ఎందుకంటే ఏ మాత్రం బ్యాలన్స్ తప్పినా, రాజ్ కుమార్ రావుతో పరకాయ ప్రవేశం చేయించలేకపోయినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉంటుంది.
ఇప్పటిదాకా ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది ఎంఎస్ ధోని ఒక్కటే. ఇప్పటికీ దాని రీ రిలీజులను ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సచిన్, అజారుద్దీన్, మిథాలీ రాజ్ లాంటి వాళ్ళ మీద వచ్చిన బయోపిక్స్ కమర్షియల్ గా ఆశించిన సక్సెస్ అందుకోలేదు. చెప్పే విధానంలో జరిగిన పొరపాట్లు లేదా జనాలు వాళ్ళను స్క్రీన్ మీద చూసే మూడ్ లో లేకపోవడం లాంటి కారణాల వల్ల కమర్షియల్ ఫెయిల్యూర్స్ అయ్యాయి.
ఇంకో రిస్క్ ఏంటంటే ఇప్పటి జెన్ జీ కుర్రకారుకి సౌరవ్ గంగూలీ మీద అవగాహన తక్కువ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మనే రిటైర్మెంట్ కు దగ్గరగా వచ్చారు. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడిప్పుడే తొలి అడుగు వేస్తున్నాడు. అలాంటిది జెన్ జీ కుర్రకారుకి గంగూలీ కథని మెప్పించేలా ఎలా చూపిస్తారనేది వేచి చూడాలి. బయట ప్రపంచానికి తెలియని డ్రామా ఏదైనా జొప్పిస్తే ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. కాకపోతే రాజ్ కుమార్ రావు ఇలాంటి టెర్రిఫిక్ పాత్రకు సూటవ్వలేదేమోననే కామెంట్స్ వినిపిస్తున్నాయి
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రమోషన్ల స్పీడ్ పెంచుతున్నారు. బజ్ పెరగాలంటే కంటెంట్ రెగ్యులర్ గా వస్తూ ఉండాలి.…
సంక్రాంతికి విడుదలైన అనగనగా ఒక రాజు వచ్చి ఆరు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా అనౌన్స్…
తమిళంలో టాప్ లీగ్ కథానాయకులకు చాలా దగ్గరగా వెళ్లిన మిడ్ రేంజ్ హీరోల్లో రవి మోహన్ అలియాస్ జయం రవి…
దక్షిణాది సినీ చరిత్రలోనే అతి పెద్ద సంచలనాల్లో ‘కాంతార’ ఒకటి. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో ప్రాంతీయ భాషా చిత్రంగా…
గత నెల విడుదలై ఇప్పటికీ డీసెంట్ రన్ కొనగిస్తున్న 'మా ఇంటి బంగారం' వంద కోట్ల మార్కుని ఏ క్షణమైనా…
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి కన్నుమూశాడు. హనుమకొండ…