Movie News

దర్శకుడు.. హీరోయిన్… కలిసి ఎక్కడికి వెళ్లారు?

ఫిలిం ఇండస్ట్రీలో కలిసి పని చేసే క్రమంలో ఇద్దరు ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం మామూలే. దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్.. హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఈ జాబితాలోకి చేరబోతున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. దర్శకుడిగా పరిచయం అయి, ఆ తర్వాత నటనలోకి అడుగు పెట్టిన తరుణ్ భాస్కర్.. ఈషాతో కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రంలో నటించాడు. ఐతే ఈ సినిమా చేస్తున్నపుడే తరుణ్, ఈషాల మధ్య రిలేషన్‌షిప్ మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి.

త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే చర్చ ‘ఓం శాంతి శాంతి శాంతి’ టైంలో జరిగింది. దీని గురించి ఆ సినిమా ప్రమోషన్లలో తరుణ్ భాస్కర్ ఓపెనయ్యాడు కూడా. కొన్నేళ్లుగా ఈషా తనకు తోడుగా ఉందని, తనకు అన్నీ ఈషానే అని కూడా అతను పేర్కొనడం విశేషం. ఇందులో చెప్పడానికి, దాచడానికి ఏమీ లేదన్న తరుణ్.. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి, సరైన సమయంలో తమ బంధం గురించి ప్రకటన చేస్తానని అతనన్నాడు.

ఐతే తరుణ్, ఈషా కలయికలో వచ్చిన ‘ఓం శాంతి శాంతి శాంతి:’ డిజాస్టర్ కాగా.. ఆ తర్వాత వాళ్లిద్దరి గురించి చర్చ ఆగిపోయింది. దీంతో బాలీవుడ్ జంటల తరహాలోనే సినిమా ప్రమోషన్ కోసం ఈ టాపిక్‌ను తెరపైకి తెచ్చారా అనే డౌట్లు కలిగాయి. కానీ తరుణ్, ఈషాలది కేవలం సినిమాతో ముడిపడ్డ బంధం కాదని స్పష్టమైంది. తాజాగా ఈ జంట కలిసి కెమెరాలకు చిక్కింది. ఇద్దరూ ఎయిర్ పోర్టులో కలిసి నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.

ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా ఏమీ చేయట్లేదు. తరుణ్ డైరక్టోరియల్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది-2’ మేకింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో ఈషాతో కలిసి కనిపించాడంటే వారి బంధం మీద ఒక క్లారిటీ వచ్చినట్లే. త్వరలోనే ఈ జంట శుభవార్త చెబితే ఆశ్చర్యమేమీ లేదు. ‘ఈ నగరానికి ఏమైంది-2’ నవంబరు 19న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్‌కు ఇంతకుముందే పెళ్లయి, విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

This post was last modified on July 8, 2026 3:39 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago