ఫిలిం ఇండస్ట్రీలో కలిసి పని చేసే క్రమంలో ఇద్దరు ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం మామూలే. దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్.. హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఈ జాబితాలోకి చేరబోతున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. దర్శకుడిగా పరిచయం అయి, ఆ తర్వాత నటనలోకి అడుగు పెట్టిన తరుణ్ భాస్కర్.. ఈషాతో కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రంలో నటించాడు. ఐతే ఈ సినిమా చేస్తున్నపుడే తరుణ్, ఈషాల మధ్య రిలేషన్షిప్ మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి.
త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే చర్చ ‘ఓం శాంతి శాంతి శాంతి’ టైంలో జరిగింది. దీని గురించి ఆ సినిమా ప్రమోషన్లలో తరుణ్ భాస్కర్ ఓపెనయ్యాడు కూడా. కొన్నేళ్లుగా ఈషా తనకు తోడుగా ఉందని, తనకు అన్నీ ఈషానే అని కూడా అతను పేర్కొనడం విశేషం. ఇందులో చెప్పడానికి, దాచడానికి ఏమీ లేదన్న తరుణ్.. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి, సరైన సమయంలో తమ బంధం గురించి ప్రకటన చేస్తానని అతనన్నాడు.
ఐతే తరుణ్, ఈషా కలయికలో వచ్చిన ‘ఓం శాంతి శాంతి శాంతి:’ డిజాస్టర్ కాగా.. ఆ తర్వాత వాళ్లిద్దరి గురించి చర్చ ఆగిపోయింది. దీంతో బాలీవుడ్ జంటల తరహాలోనే సినిమా ప్రమోషన్ కోసం ఈ టాపిక్ను తెరపైకి తెచ్చారా అనే డౌట్లు కలిగాయి. కానీ తరుణ్, ఈషాలది కేవలం సినిమాతో ముడిపడ్డ బంధం కాదని స్పష్టమైంది. తాజాగా ఈ జంట కలిసి కెమెరాలకు చిక్కింది. ఇద్దరూ ఎయిర్ పోర్టులో కలిసి నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.
ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా ఏమీ చేయట్లేదు. తరుణ్ డైరక్టోరియల్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది-2’ మేకింగ్లో బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో ఈషాతో కలిసి కనిపించాడంటే వారి బంధం మీద ఒక క్లారిటీ వచ్చినట్లే. త్వరలోనే ఈ జంట శుభవార్త చెబితే ఆశ్చర్యమేమీ లేదు. ‘ఈ నగరానికి ఏమైంది-2’ నవంబరు 19న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్కు ఇంతకుముందే పెళ్లయి, విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 8, 2026 3:39 pm
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…
కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత…
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. నటుడు-నిర్మాత బండ్ల గణేష్ ఇద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు చాలా దగ్గరైన మిత్రులే. కానీ…
ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి చిత్రాలతో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుడు శ్రీను వైట్ల. అప్పటి టాప్ స్టార్లంతా…
గత నెల చివరి వారంలో వచ్చిన శ్రీనివాస మంగాపురం ప్రేక్షకులకు గుర్తే. ఘట్టమనేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన…
టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే షార్ట్ సీజన్.. సంక్రాంతి. ఈ టైంలో వచ్చే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత…