తమిళంలో టాప్ లీగ్ కథానాయకులకు చాలా దగ్గరగా వెళ్లిన మిడ్ రేంజ్ హీరోల్లో రవి మోహన్ అలియాస్ జయం రవి ఒకడు. ‘జయం’ సహా పలు తెలుగు రీమేక్లతో హీరోగా నిలదొక్కుకున్న అతను.. తర్వాత ‘తనీ ఒరువన్’తో భారీ విజయాన్నందుకుని స్టార్గా అవతరించాడు. తమిళంలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన మణిరత్నం కలల చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’లో అతనే లీడ్ రోల్ చేశాడంటే తన రేంజ్ అర్థం చేసుకోవచ్చు.
ఐతే ఈ మధ్య రవి పేరు.. సినిమాలతో కంటే వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన భార్య ఆర్తితో తీవ్ర విభేదాలు తలెత్తి ఆమెకు రవి దూరం కావడం.. తర్వాత కెనీషా అనే సింగర్తో సహజీవనం చేయడం చర్చనీయాంశమైంది. ఐతే కెనీషాను అదే పనిగా టార్గెట్ చేయడంతో పాటు తననూ వేధింపులకు గురి చేస్తోందంటూ తన భార్య ఆర్తి మీద అతను ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు ఈ గొడవ సెటిలయ్యే వరకు తాను సినిమాల్లో నటించనని పేర్కొనడం సంచలనం రేపింది.
చాలా కూల్గా కనిపించే రవి.. ప్రెస్ మీట్లో అంత ఎమోషనల్ అవ్వడం, సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ ప్రకారమే కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడతను. తర్వాత మళ్లీ మీడియా ముందుకు కూడా రాలేదు. ఐతే ఇప్పుడు ఒక సినీ వేడుకలో రవి మాట్లాడుతూ.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. తన వ్యక్తిగత వివాదాలు తేలే వరకు సినిమాలు చేయనంటూ చేసిన ప్రకటనపై అతను అభిమానులకు క్షమాపణ చెప్పాడు.
తన జీవితంలో ఒక దశ ముగిసిందని.. ఇప్పుడు కొత్తగా ఇంకో దశ మొదలవుతుందని.. ఇది తనకు మరో జన్మ అనుకుంటానని.. ఇకపై మంచి సినిమాలతో అలరించడమే తన ఉద్దేశమంటూ తాను పోషించిన ముఖ్య పాత్రల పేర్లు చెప్పి మళ్లీ అలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలనుకుంటున్నట్లు తెలిపాడు రవి. జయం రవి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘బ్రో కోడ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ.. రవికి జోడీగా నటించింది.
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రమోషన్ల స్పీడ్ పెంచుతున్నారు. బజ్ పెరగాలంటే కంటెంట్ రెగ్యులర్ గా వస్తూ ఉండాలి.…
సంక్రాంతికి విడుదలైన అనగనగా ఒక రాజు వచ్చి ఆరు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా అనౌన్స్…
దక్షిణాది సినీ చరిత్రలోనే అతి పెద్ద సంచలనాల్లో ‘కాంతార’ ఒకటి. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో ప్రాంతీయ భాషా చిత్రంగా…
గత నెల విడుదలై ఇప్పటికీ డీసెంట్ రన్ కొనగిస్తున్న 'మా ఇంటి బంగారం' వంద కోట్ల మార్కుని ఏ క్షణమైనా…
ఇంగ్లాండ్ టీ20 టూర్లో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవుతోంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో…
తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…