దక్షిణాది సినీ చరిత్రలోనే అతి పెద్ద సంచలనాల్లో ‘కాంతార’ ఒకటి. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో ప్రాంతీయ భాషా చిత్రంగా తెరకెక్కిన ఈ కన్నడ మూవీ.. పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మొదట కన్నడలో అద్భుత స్పందన రావడంతో ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అనువదించి లేటుగా రిలీజ్ చేస్తే ప్రతి చోటా భారీ వసూళ్లు రాబట్టి ఫుల్ రన్లో రూ.400 కోట్ల మార్కును అందుకుంది.
హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి.. ఈ చిత్రానికి సీక్వెల్ చేయగా అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయి 900 కోట్ల వసూళ్లు సాధించింది. ఐతే ‘కాంతార: చాప్టర్-1’ పేరుతో వచ్చిన ఈ చిత్రానికి ఇంకో సీక్వెల్ ఉంటుందనే అభిమానులు ఆశతో ఉన్నారు. కానీ రిషబ్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోవడం, మరోవైపు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్తో రిషబ్కు ఏవో అభిప్రాయ భేదాలు రావడంతో ఈ చిత్రం ఉంటుందో లేదో అన్న సందేహాలు కలిగాయి.
కానీ రిషబ్ తన పుట్టిన రోజు సందర్భంగా ‘కాంతార: చాప్టర్-2’ గురించి అప్డేట్ ఇచ్చాడు. కాంతార ప్రపంచం కచ్చితంగా కొనసాగుతుందని అతను చెప్పాడు. తాను దర్శకత్వం చేయకుండా ఖాళీగా కూర్చోలేనని అతను స్పష్టం చేశాడు. తన రైటింగ్ టీంతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. కాంతార నెక్స్ట్ సీక్వెల్కు కథ రెడీ అవుతుందని.. భవిష్యత్తులో కచ్చితంగా ఆ సినిమా ఉంటుందని అతను తేల్చాడు.
ఐతే హోంబలే ఫిలిమ్స్ సంస్థలోనే ఈ సినిమా ఉంటుందా అన్నది మాత్రం డౌటే. ఎందుకంటే గత పుట్టిన రోజుకు రిషబ్కు సోషల్ మీడియాలో మాంచి ఎలివేషన్ ఇచ్చిన ఈ సంస్థ.. ఈ సారి బర్త్ డేకి కనీసం విష్ చేయలేదు.
కొన్ని నెలల ముందు హోంబలే ఫిలిమ్స్ సోషల్ మీడియా అకౌంట్లను రిషబ్ అన్ ఫాలో చేయడంతో ఆ సంస్థ అధినేతలతో రిషబ్కు సంబంధాలు దెబ్బ తిన్నట్లుగా అనుమానాలు వ్యక్తయ్యాయి. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ సందేహాలు నిజమే అనిపిస్తోంది. ఐతే భారీతనానికి మారుపేరైన హోంబలే ‘కాంతార’కు దూరం కావడం నిరాశ కలిగించే విషయమే అయినా.. ఈ క్రేజీ సీక్వెల్ కోసం వందల కోట్లు పెట్టడానికి వేరే నిర్మాణ సంస్థలు ఎగబడతాయనడంలో :సందేహం లేదు. రిషబే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించినా ఆశ్చర్యం లేదు.
గత నెల విడుదలై ఇప్పటికీ డీసెంట్ రన్ కొనగిస్తున్న 'మా ఇంటి బంగారం' వంద కోట్ల మార్కుని ఏ క్షణమైనా…
ఇంగ్లాండ్ టీ20 టూర్లో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవుతోంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో…
తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…
కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి…
ఖరీఫ్ సీజన్ మొదలై నెల కావొస్తుంది. కానీ ఆకాశం నుంచి చుక్క నీటి జాడలేదు. మేఘాలు మొఖం చాటేశాయి. ఇదంతా…
వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది.…