సినిమాలో విషయం ఉంటే రన్ టైం ఎంతైనా చూస్తారని ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. ఒక దశలో తెలుగు సినిమాలు రెండున్నర గంటలకు మించేవి కావు. కానీ అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి సినిమాలు మూడు గంటల నిడివితోనూ ప్రేక్షకులను కట్టిపడేయడంతో రన్ టైం గురించి ఫిలిం మేకర్స్ కంగారు పడడం మానేశారు. యానిమల్, పుష్ప-2 సినిమాలు 3 గంటల 20 నిమిషాల నిడివితో రిలీజై మంచి ఫలితాలను అందుకున్నాయి. ఇక దురంధర్-2 అయితే దాదాపు నాలుగ్గంటల రన్ టైంతో రిలీజవడమే కాదు, బ్లాక్ బస్టర్ కూడా అయి ఔరా అనిపించింది.
దీంతో నిడివి విషయంలో ఫిలిం మేకర్స్లో ఎక్కడలేని దైర్యం వచ్చేసింది. 3 గంటల పైగా నిడివితో ధైర్యంగా సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు. పెద్ది సినిమాను 3 గంటల 9 నిమిషాల రన్ టైంతో రిలీజ్ చేసి.. విడుదల తర్వాత ఇంకో 5 నిమిషాల సన్నివేశాలను కలపడం తెలిసిందే. తెలుగులో ఈ వీకెండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగబంధం చిత్రాన్ని టీం 3 గంటల 17 నిమిషాల రన్ టైంతో విడుదల చేసింది. కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం.. లెంగ్తీ రన్ టైం మైనస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో టీం అలెర్ట్ అయింది.
రెండో రోజే నాగబంధం నిడివిని 20 నిమిషాలకు పైగా తగ్గించేశారు. ఇప్పుడా చిత్రం 2 గంటల 45 నిమిషాల రన్ టైంతో నడుస్తోంది. నాగబంధం విజువల్గా అద్భుతంగా అనిపించినా.. స్క్రీన్ ప్లే లోపం, సుదీర్ఘమైన యాక్షన్ ఘట్టాలు, డైలాగులు.. అనవసరమైన పాటలతో ప్రేక్షకులకు మిశ్రమానుభూతిని కలిగించింది. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ నుంచే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అయినా సరే.. విజువల్స్ మాత్రం అద్భుతం అనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో జనం థియేటర్లకు వస్తున్నారు. వీకెండ్ వరకు బుకింగ్స్ బాగున్నాయి.
ఇప్పుడు టీం కొన్ని అనవసర సన్నివేశాలకు కోత వేసి రన్ టైం తగ్గించడంతో ఎడిటెడ్ వెర్షన్ చూసిన ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నారు. నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంపై ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టారు కొత్త నిర్మాతలు. పెదకాపుతో హీరోగా పరిచయం అయిన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. నభా నటేష్ కథానాయికగా నటించింది.
This post was last modified on July 5, 2026 8:12 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…