సినిమాలో విషయం ఉంటే రన్ టైం ఎంతైనా చూస్తారని ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. ఒక దశలో తెలుగు సినిమాలు రెండున్నర గంటలకు మించేవి కావు. కానీ అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి సినిమాలు మూడు గంటల నిడివితోనూ ప్రేక్షకులను కట్టిపడేయడంతో రన్ టైం గురించి ఫిలిం మేకర్స్ కంగారు పడడం మానేశారు. యానిమల్, పుష్ప-2 సినిమాలు 3 గంటల 20 నిమిషాల నిడివితో రిలీజై మంచి ఫలితాలను అందుకున్నాయి. ఇక దురంధర్-2 అయితే దాదాపు నాలుగ్గంటల రన్ టైంతో రిలీజవడమే కాదు, బ్లాక్ బస్టర్ కూడా అయి ఔరా అనిపించింది.
దీంతో నిడివి విషయంలో ఫిలిం మేకర్స్లో ఎక్కడలేని దైర్యం వచ్చేసింది. 3 గంటల పైగా నిడివితో ధైర్యంగా సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు. పెద్ది సినిమాను 3 గంటల 9 నిమిషాల రన్ టైంతో రిలీజ్ చేసి.. విడుదల తర్వాత ఇంకో 5 నిమిషాల సన్నివేశాలను కలపడం తెలిసిందే. తెలుగులో ఈ వీకెండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగబంధం చిత్రాన్ని టీం 3 గంటల 17 నిమిషాల రన్ టైంతో విడుదల చేసింది. కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం.. లెంగ్తీ రన్ టైం మైనస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో టీం అలెర్ట్ అయింది.
రెండో రోజే నాగబంధం నిడివిని 20 నిమిషాలకు పైగా తగ్గించేశారు. ఇప్పుడా చిత్రం 2 గంటల 45 నిమిషాల రన్ టైంతో నడుస్తోంది. నాగబంధం విజువల్గా అద్భుతంగా అనిపించినా.. స్క్రీన్ ప్లే లోపం, సుదీర్ఘమైన యాక్షన్ ఘట్టాలు, డైలాగులు.. అనవసరమైన పాటలతో ప్రేక్షకులకు మిశ్రమానుభూతిని కలిగించింది. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ నుంచే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అయినా సరే.. విజువల్స్ మాత్రం అద్భుతం అనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో జనం థియేటర్లకు వస్తున్నారు. వీకెండ్ వరకు బుకింగ్స్ బాగున్నాయి.
ఇప్పుడు టీం కొన్ని అనవసర సన్నివేశాలకు కోత వేసి రన్ టైం తగ్గించడంతో ఎడిటెడ్ వెర్షన్ చూసిన ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నారు. నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంపై ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టారు కొత్త నిర్మాతలు. పెదకాపుతో హీరోగా పరిచయం అయిన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. నభా నటేష్ కథానాయికగా నటించింది.
This post was last modified on July 5, 2026 8:12 pm
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…