ఆరు నెలల నుంచి నిర్మాత ఆఫీస్ లో సెన్సార్ చిక్కుల్లో మగ్గిపోతున్న జన నాయకుడు ఎట్టకేలకు సర్టిఫికెట్ దక్కించుకుందని చెన్నై అప్డేట్. ఊహించినట్టే A వచ్చిందని సమాచారం. జూలై 16 లేదా 23 రెండో డేట్లలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయట. అదే టైంలో విశాల్ మకుటం ఉన్న నేపథ్యంలో ఏదైనా సరే ముందుగానే నిర్ణయించుకుని చెప్పాలని బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే జన నాయగన్ సోలో రిలీజ్ అయితేనే సేఫ్ అవుతుంది.
నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటికైతే ఎలాంటి న్యూస్ రాలేదు. విపరీతమైన జాప్యం వల్ల నెలల తరబడి పెట్టుబడి భారం పెరిగిపోయింది. కొందరు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కు ఇచ్చినట్టు వార్తలు ఉన్నాయి. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలవుతున్నా ఆయన చివరి సినిమా విడుదలకు ఇంకా చిక్కులు తొలగకపోవడం పట్ల అభిమానులు అసహనంతో ఉన్నారు. విజయ్ కూడా అంత చొరవ చూపడం లేదనే డౌట్స్ లేకపోలేదు.
ఒకసారి లీకుల బారిన పడి చాలా మంది చూసేసిన జన నాయకుడు ఇంతకన్నా లేట్ చేయడం భావ్యం కాదు. పైగా భగవంత్ కేసరి రీమేక్ అనే క్లారిటీ ట్రైలర్ తోనే వచ్చేసింది. సో తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్, కలెక్షన్స్ భీభత్సంగా ఆశించలేం కానీ తమిళనాడులో భారీ రెవిన్యూ రావడం ఖాయం. ముఖ్యమంత్రిగా విజయ్ పాలనలో బిజీ అయిపోవడంతో ఈ సినిమా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మహా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడం తప్పించి ఇంకేం చేయలేరు.
ట్విస్ట్ ఏంటంటే ఈ నెలాఖరులో సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ ఉంది. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దానికి దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి జన నాయకుడు దానికి కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలని కోరుకుంటే మాత్రం జూలై 16 విజయ్ వచ్చేయాలి. ప్రస్తుతానికి ఇవన్నీ లెక్కల దశలోనే ఉన్నాయి కనక నిర్ధారణగా ఏదీ చెప్పలేం. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన జన నాయకుడులో పూజా హెగ్డే, మమిత బైజు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న…
వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన దరిమిలా.. అమరావతిపై మరింత ఆసక్తి పెరిగింది. గూగుల్లో అమరావతి రాజధానిపై బుధవారం…
2026 ఆరు నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ వరకు చూసుంటే కనీసం సూపర్ హిట్లని చెప్పుకునేవి పది సినిమాలు లేకపోవడం కొంత…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత అయోధ్య బాల రామయ్యకు భక్తులు సమర్పించిన కానుకల దోపిడీ వ్యవహారంలో కీలక విషయం వెలుగు చూసింది.…
రీ రిలీజుల ట్రెండ్ జనాలకు మొహం మొత్తిపోయేలా విసిగిస్తోంది. వారానికి ఒకటి రెండు క్రమం తప్పకుండా వీటిని వదులుతూ డిస్ట్రిబ్యూటర్…
వైసీపీ అధినేత జగన్పై జనసేన కీలక నాయకుడు, మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ నిర్ణయాలు ఆపండి…