ఆ మధ్య పెద్ది విడుదలయ్యాక అందులో జాన్వీ కపూర్ పాత్ర గురించి ఎంత డిబేట్లు జరిగాయో తెలిసిందే. బికినీలు బూతులు లేనిదే సినిమాలు తీయలేని కొందరు బాలీవుడ్ పెద్దలు సైతం ఈ పాయింట్ మీద గొంతు చించుకోవడం మహా విచిత్రం. దర్శకుడు బుచ్చిబాబు క్యారెక్టరైజేషన్ లో తప్పులు ఉండొచ్చేమో కానీ గతంలో ఎవరూ చేయలేదనే తరహాలో ప్రొజెక్ట్ చేయడం విమర్శలకు దారి ఇచ్చింది. సరే ఇదంతా గతమనుకుందాం. తాజాగా టాక్సిక్ టీజర్ కొత్తది వచ్చింది.
యష్ హీరోగా రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలోని స్త్రీలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తో పాటు హ్యూమా ఖురేషి ఇందులో మెయిన్ లేడీస్ క్యాస్టింగ్. కొన్ని యాక్షన్ విజువల్స్ తో పాటు బోల్డ్ సన్నివేశాలను ఇందులో చూపించారు. ముందే పిల్లలకు చూపించవద్దని హింట్ ఇచ్చారు కానీ స్మార్ట్ టీవీలు ఫోన్ల ప్రపంచంలో యూట్యూబ్ నుంచి వాటిని దాచడం అసలు జరిగే పనేనా. అందులోనూ కెజిఎఫ్ హీరోవి.
ముందు నుంచి దర్శకురాలు గీతూ మోహన్ దాస్ హైలైట్ చేసినట్టు ఇందులో వయొలెన్స్ తో పాటు రొమాన్స్ చాలా ఘాటుగా ఉండబోతోంది. కొత్త టీజర్ లో కూడా అదే ఫోకస్ చేశారు. ఫైట్లతో పాటు పిల్లలు కళ్ళుమూసుకునే సన్నివేశాలు చాలానే ఉండబోతున్నాయి. పెద్దిలో చూపించింది అంత పెద్ద తప్పు అయినప్పుడు మరి టాక్సిక్ లో కంటెంట్ గురించి ఎవరు మాట్లాడతారో చూడాలి. రిలీజయ్యే దాకా సైలెంట్ గా ఉంటారేమో.
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ చేతిలో కేవలం 55 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి నుంచే ప్రమోషన్ల వేగం పెంచాలి. ఈసారి వాయిదా వేసే ఛాన్స్ లేదు. అందుకే పబ్లిసిటీ గేరు మార్చి రిలీజ్ టైంకి హైప్ పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. అడల్ట్స్ ఓన్లీ అని స్పష్టంగా మెసేజ్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్తున్న విధానం చూస్తుంటే యష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైనా పర్లేదనే ఫీలింగ్ వచ్చినట్టు ఉంది. చూడాలి మరి మొత్తం సినిమాలో ఇంతే మోతాదులో శృంగారం, పోరాటం ఉంటుందేమో.
This post was last modified on July 1, 2026 1:19 pm
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను…
ఆగస్ట్ 21 ఇరుముడి విడుదల కానుంది. ముందు నుంచి దీని మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వరస ఫ్లాపులతో…
ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి పది పదిహేను సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళంటే నమ్మడానికి అసాధ్యం అనిపించినా ఒకదశలో కృష్ణ, చిరంజీవి…
దేశంలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్ల ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిదశలో రూ.10, రూ.20 విలువ కలిగిన…
వరుసగా మూడో పర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు మీద చాలా ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం…
మాచర్లలో వైసీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ.. మాజీ సీఎం, వైసీపీ అధినేత…