ఇవాళ అల్లరి నరేష్ పుట్టినరోజు. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు ఒక్కొక్కటిగా గ్రీటింగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్లు విడుదల చేస్తున్నాయి. సెప్టెంబర్ 4 ‘రంభ ఊర్వశి మేనక’ వస్తుందని అధికారికంగా ప్రకటించారు. అయితే మన టాపిక్ అది కాదు. అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ‘ఆల్కహాల్’ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. గత ఏడాది టీజర్ తో పాటుగా 2026 జనవరి 1 మూవీ రిలీజ్ ఉంటుందని సితార ఎంటర్ టైన్మెంట్స్ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చింది.
అంతే ఆ తర్వాత ఉలుకు పలుకు లేదు. అల్కహాల్ టీజర్ వచ్చి 9 నెలలు దాటేసింది. ఇప్పటి దాకా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు. తాజాగా వదిలిన కొత్త పిక్ లో హీరోకి శుభాకాంక్షలు చెప్పారు కానీ అసలైన శుభవార్త మాత్రం అందులో లేదు. మెహర్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుహాని శర్మ, నీహారిక ఎన్ఎం హీరోయిన్లు కాగా సత్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. గిబ్రాన్ సంగీతం అందించడం లాంటి బలమైన టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేసింది.
కంటెంట్ విషయంలో ఏదైనా జాప్యం జరుగుతోందో లేక ఓటిటి డీల్ లాంటి చిక్కులు ఏమైనా ఏర్పడ్డాయో తెలియదు కానీ ఆల్కహాల్ పేరుకి తగ్గట్టే ఒక వర్గం మూవీ లవర్స్ అటెన్షన్ అయితే లాగింది. మందు అలవాటు లేని ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారట. టీజర్ లో అదే హైలైట్ చేశారు. ఇంత వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి ప్రెజెంటేషన్ కూడా అదే స్థాయిలో ఉంటే జనాలకు కనెక్ట్ కావొచ్చు..
ఇంతకీ ఆల్కహాల్ ని థియేటర్ రిలీజ్ చేసే ఉద్దేశంలో నిర్మాత నాగవంశీ ఉన్నారో లేదో అంతు చిక్కడం లేదు. ఇదే బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి తీసిన ‘మ్యాజిక్’ కూడా ఇదే తరహాలో మోక్షం కోసం ఎదురు చూస్తోంది. ఇంత అగ్ర నిర్మాణ సంస్థ నుంచి పేరున్న హీరోల సినిమాలే ఇలా రిలీజ్ గుమ్మం దగ్గర ఆగిపోవడం విచిత్రమైన విషయం. బడ్జెట్ ఇష్యూస్, బిజినెస్ సమస్యలు లేని ఇలాంటి వాటికి ఆటంకాలు ఎదురు కావడమంటే సంథింగ్ ఫీషి అనుకోవాలి. అదేంటో మరి.
మాస్ హీరోయిజంలో కామెడీ మిక్స్ చేసి మెప్పించడంలో రవితేజకు సాటి రావడం అంత ఈజీ కాదు. తన ముద్రని మ్యాచ్…
నిన్న జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ప్రకటన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయ వ్యక్తీకరణ జరుగుతోంది.…
టాలీవుడ్ నుంచి మరో మెగా మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న గాడ్ ఆఫ్ వార్…
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…