నిన్న జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ప్రకటన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయ వ్యక్తీకరణ జరుగుతోంది. ఏఐ వాడి పోస్టర్ చేయడం పట్ల కొంత మిశ్రమ స్పందన ఉండగా, కుమారస్వామి జననం ఉత్తరాదిలో జరిగినట్టు నిర్మాణ సంస్థ ట్వీట్లలో పేర్కొనడం తమిళులకు ఆగ్రహం కలిగించింది. తమ ఆరాధ్య దైవం గురించి పూర్తిగా తెలుసుకుని వాస్తవాలు పెట్టమని కోరుతున్నారు. ఇదంతా అలా ఉంచితే త్రివిక్రమ్ ఫేస్ చేయాల్సిన రిస్కులు చాలా ఉన్నాయి.
వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శివుడి ఎలిమెంట్. టాలీవుడ్ హిస్టరీలో అధిక శాతం ఆయన బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాలు ఆశించిన విజయం అందుకోలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ ‘దక్షయజ్ఞం’ గొప్పగా ఉంటుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు. చిరంజీవి ‘ఆపద్బాంధవుడు’లో మెగాస్టార్ మొదటిసారి శివుడిగా నర్తిస్తే వర్కౌట్ కాలేదు. ‘శ్రీ మంజునాథ’లో ఏకంగా టైటిల్ రోల్ చేశారు కానీ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. శివలింగం మీద కథ నడిపించిన ‘అంజి’ ఎంత ఫ్లాపో చెప్పాల్సిన పని లేదు.
నాగార్జున ‘డమరుకం’ సైతం శివుడి నేపధ్యం తీసుకుని ఏళ్లకేళ్లు నిర్మాణం జరుపుకుని ఎన్నో అడ్డంకులు దాటుకుని చివరికి నిరాశ కలిగించే ఫలితాన్ని అందుకుంది. మంచు విష్ణు ‘కన్నప్ప’ ఏమయ్యిందో తెలిసిందే. అయితే కొన్ని ఈ ప్రతికూల సెంటిమెంట్ ని గెలిచినవి ఉన్నాయి. కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ క్లాసిక్ గా తరతరాలు గుర్తుండిపోయింది. బాలకృష్ణ ‘అఖండ’ చాలా పెద్ద హిట్టయ్యింది. నలభై సంవత్సరాల క్రితం గీత ఆర్ట్స్ స్టార్స్ లేకుండా తీసిన ‘మా ఊళ్ళో మహాశివుడు’ ఆడలేదు.
బ్లాక్ అండ్ వైట్ కాలంలో ‘భూ కైలాస్’ లాంటి ఆణిముత్యాలు లేకపోలేదు. కాకపోతే శివుడిని కోర్ ఎలిమెంట్ గా తీసుకోవడం కత్తి మీద సాము లాంటిది. హ్యాండిల్ చేయడంలో ఏ మాత్రం తడబడినా దాని ప్రభావం ఫలితం మీద మాములుగా ఉండదు. అందుకే మాటల మాంత్రికుడికి ఇదో పెద్ద ఛాలెంజ్ కానుంది. షూటింగ్ ఇంకా స్టార్ట్ కాని ఈ ప్యాన్ ఇండియా మూవీలో శివుడు, కుమారస్వామిగా తారక్ డ్యూయల్ రోల్ చేస్తాడా లేక త్రివిక్రమ్ ఏదైనా ఊహించని షాకులు ఇస్తారా అనేది అంతు చిక్కడం లేదు. అయితే ఈ సినిమా కథాంశం ప్రధానంగా కుమారస్వామి మీద నడుస్తుంది కాబట్టి శివుడు ఎంత మొత్తంలో హైలైట్ అవుతారనేది వేచి చూడాలి
టాలీవుడ్ నుంచి మరో మెగా మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న గాడ్ ఆఫ్ వార్…
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…