Movie News

తారక్ & త్రివిక్రమ్… యుద్ధం మొదలుకానుంది

అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నిరీక్షణ ఫలించింది. ఈ ప్యాన్ ఇండియా మూవీని అధికారికంగా ప్రకటించేశారు. ఆదర్శ కుటుంబం షూటింగ్ దాదాపు పూర్తయిన సందర్భంలో ఈ అనౌన్స్ మెంట్ రావడం గమనార్హం. ప్రస్తుతం డ్రాగన్ లో బిజీగా ఉన్న తారక్ అది పూర్తి చేసుకుని వచ్చాక మాటల మాంత్రికుడి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు.

కాన్సెప్ట్ పోస్టర్ లో ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ ముందు నుంచి ప్రచారం జరిగినట్టు ‘గాడ్ అఫ్ వార్’ థీమ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. త్రిశూలం, దాని ముందు కుమారస్వామి ఆయుధం, కుడి ఎడమల వైపు గుళ్ళు గోపురాలతో పాటు యుద్ధం జరిగిన అంశాలను పొందుపరచడం ద్వారా ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్న క్లూ అయితే ఇచ్చారు. ముందు అల్లు అర్జున్ తో అనుకున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత తారక్ కు వచ్చిన సంగతి తెలిసిందే.

కాకపోతే విడుదల ఎప్పుడనేది అంత ఈజీగా తేలకపోవచ్చు. ఎందుకంటే ఈ ప్యాన్ ఇండియా మూవీకి భారీ బడ్జెట్ పెడుతున్నారు. డ్రాగన్ రెండు భాగాలు 2027లో వస్తే కనక ఇప్పుడీ త్రివిక్రమ్ సినిమాని 2029లో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అంత ఆలస్యం అవుతుందా అంటే స్కేల్ ప్రకారం చూసుకుంటే చాలా టైం అవసరం పడేలా ఉంది. ఒకవేళ దేవర 2 కనక మధ్యలో చేస్తే ఎక్కువ గ్యాప్ వచ్చిన ఫీలింగ్ ఫ్యాన్స్ కి ఉండదు. కాకపోతే గ్యారెంటీగా చెప్పలేం.

ఇప్పటిదాకా తెలుగులో మాత్రమే సినిమాలు తీస్తూ వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేయబోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు తన పేరుని పరిచయం చేయబోతున్నారు. డబ్బింగ్ రూపంలో వాళ్లకు తెలిసినప్పటికీ ఇంత పెద్ద గ్రాండియర్ ద్వారా అక్కడ లాంచ్ అయితే వచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ కు, దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చబోయే సినిమా ఇదే.

Kumar

Recent Posts

ఇరుముడికి పొంచి ఉన్న రెండు ముప్పులు

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…

55 minutes ago

సూర్య సరైన దారిలోకి వచ్చినట్టే

ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…

2 hours ago

తూచ్… అమరావతికి వ్యతిరేకమని జగన్ చెప్పలేదా?

అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…

3 hours ago

పోటీ పడుతున్న తెలుగు వెబ్ సిరీసులు

కరోనా తర్వాత ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, స్కామ్ 1992 లాంటి బ్లాక్ బస్టర్స్ వల్ల కొంత కాలం వెబ్ సిరీస్…

6 hours ago

పెద్ది OTT… తొందరపడటం లేదు

మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా నెట్ ఫ్లిక్స్ చేసుకునే ఓటిటి విండో 28 రోజులు ఉంటుంది. గుంటూరు కారం,…

7 hours ago

బీజేపీ బెంగాల్ రాజకీయం తెలంగాణలో పని చెయ్యదా?

తెలంగాణ‌లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు…

11 hours ago