త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయినా.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి కదలిక కనిపించలేదు. దీంతో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.
మధ్యలో ఈ కథను ఎన్టీఆర్ కాదు.. అల్లు అర్జున్ చేయబోతున్నాడనే ప్రచారం కూడా బలంగా జరిగింది. దీంతో అసలు హీరో ఎవరు అన్నదే పెద్ద చర్చగా మారింది.
ఇప్పుడు నిర్మాత నాగ వంశీ చేసిన ఒక్క పోస్ట్ అభిమానుల్లో మళ్లీ జోష్ నింపింది. రేపు గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ ఉంటుందని ఆయన అధికారికంగా హింట్ ఇచ్చారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను ఎన్టీఆర్ నే చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ మాత్రం రేపే రానుంది.
ఎన్నో నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు రేపటి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగానే గాడ్ ఆఫ్ వార్ పట్టాలెక్కితే టాలీవుడ్ లో మరో భారీ కాంబినేషన్ మొదలైనట్టే.
2026 సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఏదో నిన్నా మొన్నా కొత్త సంవత్సరం జరుపుకున్నట్టు ఉంది కానీ కాలం కర్పూరంలా…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్…
షాహిద్ కపూర్,కృతి సనన్, రష్మిక మందన్న కలయికలో రూపొందిన కాక్ టైల్ 2 వసూళ్లు బాగా పడిపోవడం నిర్మాతలను ఆందోళనకు…
ఒకవేళ సాహో పెద్ద హిట్టయ్యింటే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగులో వరసగా కనిపించేదేమో కానీ అనుకున్న ఫలితం అందుకోకపోవడంతో పూర్తిగా…
అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు…
ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం జూలై 9 విడుదలని మొన్నటి దాకా టీమ్…