మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. నిజమే.ఎవరూ కాదనలేరు. అయితే ఇవాళ వైజాగ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ రివ్యూల వల్ల కాకుండా ప్రజలు పెట్టిన పాజిటివ్ పోస్టుల వల్ల సినిమా హిట్టయ్యిందని కొత్త భాష్యం చెప్పారు. అఫ్కోర్స్ ప్రేక్షకుల మద్దతు లేకుండా ఏ సినిమా ఆడదు. లవకుశ అప్పట్లోనే కోటి వసూలు చేసినా, పెద్ది మూడు వందల కోట్లు ఒక్క తెలుగు వెర్షన్ నుంచి రాబట్టినా అదంతా పబ్లిక్ చూపించిన ప్రేమే.
అయితే నందిని రెడ్డి అన్నట్టు కేవలం పోస్టులతోనే ఇంత పెద్ద విజయం దక్కిందనుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంటి బంగారంకు అండగా నిలబడిన మహిళలు ఎంత మందికి సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి. ట్విట్టర్ మీద అవగాహన లేని వాళ్ళను లెక్కబెట్టుకుంటే లక్షల్లో తేలతారు. ఫేస్ బుక్ సంగతి సరేసరి. వాటి ప్రభావం పరిమిత శాతంలోనే ఉంటుంది. రివ్యూలు అందుబాటులో ఉన్న మీడియా పరిధి చాలా విస్తృతంగా ఉంటుందనేది ఓపెన్ ఫ్యాక్ట్.
అందుకే పలు మాధ్యమాల ద్వారా జనం రివ్యూలను ఫాలో అవుతుంటారు. న్యూస్ పేపర్, వెబ్ సైట్, సోషల్ మీడియా, గ్రూపింగ్ యాప్స్ ఇలా రకరకాల దారులు ఉన్నాయి. వీడియోల ద్వారా కొందరు, అక్షరాల రూపంలో మరికొందరు పాజిటివ్, నెగటివ్ రెండు రకాలుగా స్పందించేవాళ్ళు ఉంటారు. నందిని రెడ్డి తీసిన గత సినిమా అన్నీ మంచి శకునములే ఫ్లాప్ అయ్యింది. దీనికి రివ్యూలు కారణం కాదు. సంతోషం. మరి ఇదే ప్రజలు పోస్టులు పెట్టి హిట్ చేసి ఉండొచ్చు కదా.
ఇదేదో కౌంటర్ ఇచ్చే ఉద్దేశమో మరొకటో కాదు. కంటెంట్ బాగుంటే రివ్యూలు అదే హైలైట్ చేస్తాయి. ఆడియన్స్ ఎలాగూ థియేటర్లకు వచ్చి జై కొడతారు. లిటిల్ హార్ట్స్ కన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి. దానికి పాజిటివ్ రివ్యూలే వచ్చాయిగా. సమంతతో నందిని రెడ్డి తీసిన ఓ బేబీ మంచి విజయం సాధించినా, జబర్దస్త్ అనే సినిమా అడ్రెస్స్ లేకుండా పోయినా దానికి బాధ్యత తీసినవాళ్లదే తప్ప రివ్యూలదో ప్రజలదో కాదు. ఇదంతా ఎలా ఉన్నా మా ఇంటి బంగారం మాత్రం నిర్మాతలకు బంగారమే అయ్యింది.
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…