మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. నిజమే.ఎవరూ కాదనలేరు. అయితే ఇవాళ వైజాగ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ రివ్యూల వల్ల కాకుండా ప్రజలు పెట్టిన పాజిటివ్ పోస్టుల వల్ల సినిమా హిట్టయ్యిందని కొత్త భాష్యం చెప్పారు. అఫ్కోర్స్ ప్రేక్షకుల మద్దతు లేకుండా ఏ సినిమా ఆడదు. లవకుశ అప్పట్లోనే కోటి వసూలు చేసినా, పెద్ది మూడు వందల కోట్లు ఒక్క తెలుగు వెర్షన్ నుంచి రాబట్టినా అదంతా పబ్లిక్ చూపించిన ప్రేమే.
అయితే నందిని రెడ్డి అన్నట్టు కేవలం పోస్టులతోనే ఇంత పెద్ద విజయం దక్కిందనుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంటి బంగారంకు అండగా నిలబడిన మహిళలు ఎంత మందికి సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి. ట్విట్టర్ మీద అవగాహన లేని వాళ్ళను లెక్కబెట్టుకుంటే లక్షల్లో తేలతారు. ఫేస్ బుక్ సంగతి సరేసరి. వాటి ప్రభావం పరిమిత శాతంలోనే ఉంటుంది. రివ్యూలు అందుబాటులో ఉన్న మీడియా పరిధి చాలా విస్తృతంగా ఉంటుందనేది ఓపెన్ ఫ్యాక్ట్.
అందుకే పలు మాధ్యమాల ద్వారా జనం రివ్యూలను ఫాలో అవుతుంటారు. న్యూస్ పేపర్, వెబ్ సైట్, సోషల్ మీడియా, గ్రూపింగ్ యాప్స్ ఇలా రకరకాల దారులు ఉన్నాయి. వీడియోల ద్వారా కొందరు, అక్షరాల రూపంలో మరికొందరు పాజిటివ్, నెగటివ్ రెండు రకాలుగా స్పందించేవాళ్ళు ఉంటారు. నందిని రెడ్డి తీసిన గత సినిమా అన్నీ మంచి శకునములే ఫ్లాప్ అయ్యింది. దీనికి రివ్యూలు కారణం కాదు. సంతోషం. మరి ఇదే ప్రజలు పోస్టులు పెట్టి హిట్ చేసి ఉండొచ్చు కదా.
ఇదేదో కౌంటర్ ఇచ్చే ఉద్దేశమో మరొకటో కాదు. కంటెంట్ బాగుంటే రివ్యూలు అదే హైలైట్ చేస్తాయి. ఆడియన్స్ ఎలాగూ థియేటర్లకు వచ్చి జై కొడతారు. లిటిల్ హార్ట్స్ కన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి. దానికి పాజిటివ్ రివ్యూలే వచ్చాయిగా. సమంతతో నందిని రెడ్డి తీసిన ఓ బేబీ మంచి విజయం సాధించినా, జబర్దస్త్ అనే సినిమా అడ్రెస్స్ లేకుండా పోయినా దానికి బాధ్యత తీసినవాళ్లదే తప్ప రివ్యూలదో ప్రజలదో కాదు. ఇదంతా ఎలా ఉన్నా మా ఇంటి బంగారం మాత్రం నిర్మాతలకు బంగారమే అయ్యింది.
తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…