పెద్ది బ్లాక్ బస్టర్ అయినప్పటికీ దాని విజయం తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితం కావడం అభిమానులకు కొంత అసంతృప్తి మిగిల్చింది. ఓవర్సీస్, ఉత్తరాదితో పాటు తమిళ కేరళలో ఆశించిన వసూళ్లు రాకపోవడం నిరాశ కలిగించే విషయమే. సరే కమర్షియల్ లెక్కల సంగతి ఎలా ఉన్నా రామ్ చరణ్ పడిన కష్టం ఆడియన్స్ కి పూర్తిగా చేరింది. కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ దానికి తగ్గ గౌరవాన్ని అందుకున్నాడు. ఇక అందరి చూపు ఆర్సి 17 మీదకు వెళ్తోంది.
రంగస్థలం తర్వాత రిపీట్ అవుతున్న కాంబో కావడంతో ప్రకటన నుంచే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్యాన్ ఇండియా మూవీని దర్శకుడు సుకుమార్ రెండు భాగాలుగా తీయబోతున్నారని తెలిసింది. కెజిఎఫ్, పుష్ప లాగా ఒకదాని తర్వాత మరొకటి కాకుండా దురంధర్ స్టయిల్ లో సమాంతరంగా తీసి తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులు ఉండేలా చూస్తారట. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ ఆల్రెడీ ఇదే తరహా ప్లానింగ్ లో ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్.
ఒకవేళ ఇది నిజమైతే సమర్ధించాల్సిన నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే చరణే కాదు టయర్ వన్ హీరోలు అందరికీ ప్రధానంగా వస్తున్న సమస్య ప్రతి సినిమాకు మధ్య ఉంటున్న గ్యాప్. కనీసం రెండు సంవత్సరాలు టైం పెట్టుకుని మరీ ప్యాన్ ఇండియాలకు అంకితం అయిపోతున్నారు. ఇలాంటప్పుడు ఒకేసారి రెండు భాగాలు తీయడం ద్వారా సీక్వెల్ క్రేజ్ తో పాటు ఎక్కువ కాలం తెరకు దూరమయ్యామనే అసంతృప్తిని హీరోల మనసులో తగ్గించవచ్చు.
డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావొచ్చని తెలిసింది. సుకుమార్ ఈసారి పల్లెటూళ్ళు, అడవులు వదిలి నగరం బాట పట్టారట. స్టయిలిష్ యాక్షన్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట. హీరోయిన్, ఇతర క్యాస్టింగ్ ప్రాథమికంగా ఓకే అయ్యింది కానీ ఇంకా అఫీషియల్ గా లాక్ చేయాల్సి ఉంది. షూటింగ్ డేట్స్ ఫిక్స్ అయితే తప్ప కాల్ షీట్లు తీసుకోలేరు. అందుకే వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలిసింది. పుష్ప తర్వాత మూవీ కావడంతో సుకుమార్ కిది చాలా కీలకం కానుంది.
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం. ఇది…
రజనీకాంత్ హీరోగా గత పదేళ్లలో వచ్చిన బెస్ట్ మూవీ ఏదంటే ఠక్కున గుర్తొచ్చే పేరు జైలర్ ఒక్కటే. కమర్షియల్ గా…
తాజాగా నెట్ ఫ్లిక్స్ లో 'బాహుబలి ది టార్చ్ బేరర్' అనే డాక్యు సిరీస్ విడుదలయ్యింది. మొత్తం నాలుగు ఎపిసోడ్లు…
నిన్న సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ నిర్మాణంలో ఇడుపు కాయితం అనే కొత్త సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. లోకేష్…
మొన్న విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ ధర్మన్ ఫస్ట్ లుక్ మీద నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. ఏఐ వాడారని,…
కొత్తగా యాపిల్ ప్రొడక్ట్స్ కొనాలని అనుకునేవారికి ఇది చేదు వార్తే. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన మ్యాక్ బుక్,…