Movie News

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు వెళ్లిపోవడం గురించే ఉంది. ఇంత బ్లాక్ బస్టర్ రన్ కొనసాగిస్తూ ఏబీసి సెంటర్ తేడా లేకుండా ప్రతి చోటా ఊచకోత కోస్తున్న టాలీవుడ్ సినిమాకు కౌంట్ తగ్గించి, ఒక కన్నడ డబ్బింగ్ మూవీకి ఎలా ఇస్తారనే దాని మీద తెలుగు యువత ఆన్ లైన్ లో యుద్ధాలు చేసినంత పనికి సిద్ధపడింది. రవితేజకు చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ తాలూకు పరిణామమిది.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆగస్ట్ 21 ఇరుముడి రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు ముందు టాక్సిక్ లేదు. కేవలం అయిదు రోజుల గ్యాప్ లో ఆగస్ట్ 26 మేం వస్తున్నామని ప్రకటించినప్పుడు మైత్రి వెనుకడుగు వేయలేదు. ఒకవేళ రవితేజ పోషించిన త్రినాధ్ పాత్ర తాలూకు ఇంపాక్ట్ బాక్సాఫీస్ మీద ఈ స్థాయిలో ఉంటుందని బహుశా అంచనా వేయలేదేమో. హిట్ అవుతుందని భావించి ఉండొచ్చు కానీ ఇంతగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందని అంత అనుభవమున్న నిర్మాతలు ఊహించి ఉండరు.

బిజినెస్సులు ఈగోలు రాజ్యమేలే పరిశ్రమలో సెంటిమెంట్ల కన్నా వ్యాపారానికే ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. టాక్సిక్ హక్కులను భారీ మొత్తానికి కొన్న ఎస్విసి వెర్షన్ మరోలా వినిపిస్తోంది. అంత భారీ మొత్తంలో హక్కులు కొన్నప్పుడు అది రికవరీ కావాలంటే మా శక్తి మేరకు రిలీజ్ చేసుకుంటాం తప్ప అవతలి వాళ్ళ కోసం త్యాగాలు ఎలా చేస్తామనేది అటు నుంచి వినిపిస్తున్న మాట. కానీ టాలీవుడ్ కు వీలైనంత మద్దతు ఇవ్వాలనేది నెటిజన్ల నుంచి వస్తున్న కామెంట్.

సరే చివరికి ఎవరిది ఆధిపత్యం అవుతుందనేది పక్కన పెడితే టాక్సిక్ తో ఇలాంటి క్లాష్ కన్నా ఒక వారం ముందు విశ్వనాథ్ అండ్ సన్స్ తో పోటీ పడి ఉంటేనే బాగుండేదనే అభిప్రాయాలు మాస్ మహారాజా ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. లేక లేక తమ హీరో హిట్టు కొడితే ఇలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సినిమాలకు దారి ఇవ్వడం కోసం తన ఈగల్ ని త్యాగం చేసిన 2023 ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. చూడాలి ఇంకేం  జరుగనుందో. 

This post was last modified on August 24, 2026 5:56 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

10 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

4 hours ago