ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న పాత సినిమాలకు ఈవెంట్ చేయడం కొత్త కాదు కానీ ఇంత గ్రాండ్ గా చేయడం అరుదు. ఎందుకంటే ఆ మల్టీప్లెక్సులో ఈవెంట్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా వచ్చిన ప్రతి ఒక్కరికి 3డి గ్లాసులు సప్లై చేశారు. వీటికి అదనంగా ఛార్జ్ ఉంటుంది. స్క్రీన్ అద్దె, బ్యానర్లు, యాంకర్, టీమ్ వ్యయాలు, మీడియా మేనేజ్ మెంట్ ఇలా సవాలక్ష పనులు చూసుకోవాలి.
కొత్త మూవీకి ఇలా చేయడం మాములే కానీ జస్ట్ రెండేళ్ల క్రితం వచ్చిన హనుమాన్ కి ఇంత హడావిడి చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎంత 3డి అయినా జనాలు మరీ ఎగబడిపోయి వస్తారని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ని సైతం ఈ సాంకేతికలో చూసేందుకు తెలుగు ఆడియన్స్ పెద్దగా ఇష్టపడలేదు. కాకపోతే హనుమాన్ కేసు వేరు. విఎఫెక్స్, ఫాంటసీ ఎపిసోడ్స్, క్లైమాక్స్ వగైరాలు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటాయి. రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక్కడో విషయం గమనించాలి. సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు గెస్టుగా వచ్చాడు. కారణం సింపుల్. హనుమాన్ తీసిన నిరంజన్ రెడ్డినే సంబరాల ఏటిగట్టుక్లి ప్రొడ్యూసర్ కాబట్టి. ఇది చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఇప్పటికీ రిలీజ్ డేట్ ఫైనల్ చేయలేదు. ప్యాన్ ఇండియా సినిమాలు డిసెంబర్ దాకా కర్చీఫ్ లు వేసుకుంటున్న తేజ్ టీమ్ మాత్రం సైలెంట్ గా ఉంది. అయిపోయింది వచ్చేస్తుంది అంటున్నారు తప్ప ఫలానా తేదీ అని కన్ఫర్మ్ గా చెప్పడం లేదు.
ఇప్పుడీ ఈవెంట్ ద్వారా ప్రైమ్ షో సంస్థ తమ మీద వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. హనుమాన్ 3డిని తీసుకురావడం ద్వారా తమ బ్రాండ్ ని మరోసారి గుర్తు చేయడంతో పాటు నెక్స్ట్ వచ్చే సినిమాలకు ఎలాంటి ఢోకా ఉండదనే సందేశం ఇస్తున్నారేమో. జూన్ చివరి వారంలో చాలా రీ రిలీజులు ఉన్నాయి. హనుమాన్ 3డికి ఫ్యామిలీస్, చిన్న పిల్లల సపోర్ట్ చాలా అవసరం. నెలాఖరులో టికెట్ల కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారానేది వేచి చూడాలి.
This post was last modified on June 21, 2026 10:09 pm
మొదట నటుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరి.. తర్వాత దర్శకుడిగా మారుతుంటే తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అని…
నాలుగు వేల కోట్లతో తీశామని గతంలో రామాయణ గురించి గర్వంగా చెప్పుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా తర్వాత ఆ మాట…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ను మించిన హీరో రావడం అసాధ్యం అనుకున్నారంతా. ఒకప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఆ…
ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా…
గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో…
త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ…