ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం అంతకంతకూ తగ్గించేస్తుండడంతో ఆక్యుపెన్సీలు పడిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఉన్నంతలో వైడ్ రిలీజ్ దక్కిన ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు రెండో రోజు థియేటర్లు, స్క్రీన్లు పెరుగుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే.
సమంత కొత్త చిత్రం మా ఇంటి బంగారం ఈ ఘనతే సాధిస్తోంది. పెద్ది రిలీజై రెండు వారాలు గడిచిపోవడం.. పోటీగా రిలీజైన సినిమాలు చిన్నవే కావడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బాగానే థియేటర్లు ఇచ్చారు. ఐతే రిలీజ్ ముంగిట సినిమాకు ఉన్న క్రేజ్.. విడుదల తర్వాత ఇంకా పెరిగింది. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి.. బుకింగ్స్ అంతకంతకూ పెరగడంతో కొన్ని చోట్ల ఉన్న థియేటర్లు సరిపోవడం లేదు.
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పెద్ది సినిమా రెండో వారంలో హౌస్ ఫుల్స్తో రన్ అయిన నేపథ్యంలో థర్డ్ వీకెడ్ కోసం చాలా స్క్రీన్లను అట్టిపెట్టారు. మా ఇంటి బంగారం చిత్రం స్థాయికి తగ్గట్లుగా నగరాలు, పట్టణాల్లో స్క్రీన్లు కేటాయించారు. కానీ సినిమాకు శనివారం ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడడం.. ఉన్న స్క్రీన్లు సరిపోకపోవడంతో చాలా చోట్ల స్క్రీన్లు, షోలు పెంచినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇటు సింగిల్ స్క్రీన్లను యాడ్ చేయడంతో పాటు మల్టీప్లెక్సుల్లో షోలూ పెంచుతున్నారు. ఆదివారం కూడా సినిమా చాలా బాగా ఆడుతుందనే సంకేతాలు కలుగుతున్నాయి. తెలంగాణలోనూ మల్టీప్లెక్సుల్లో ఈ మూవీకి షోలు పెంచారు.
వీకెండ్లో మా ఇంటి బంగారం ట్రేడ్ పండితుల అంచనాలను మించి ఊహించని నంబర్స్ సాధించబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ.. అందులోనూ ఎబోవ్ యావరేజ్ టాక్, రివ్యూలు తెచ్చుకున్న చిత్రానికి ఇంత డిమాండ్ ఏర్పడడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బయ్యర్లందరూ వీకెండ్లోనే లాభాల బాట పట్టబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…