టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత అతడు సక్సెస్ రుచి చూడలేదు. తన పరాజయ పరంపరకు ఈ చిత్రం బ్రేక్ వేస్తుందని ప్రతిసారీ ఆశలు పెట్టుకోవడం, నిరాశ చెందడం మామూలైపోయింది.
గత ఏడాది ‘తమ్ముడు’ సినిమా తన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలవడం, ‘యల్లమ్మ’ తన చేతుల్లోంచి చేజారిపోవడంతో నితిన్ తీవ్ర నిరాశకు గురైనట్లే కనిపించాడు. అందుకే కొత్త సినిమా సంగతి తేల్చడానికి చాలా టైం తీసుకున్నాడు. ఐతే ఇటీవలే సోము, నర్రి అనే ఇద్దరు కొత్త దర్శక ద్వయంతో కలిసి అతను సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఈ చిత్రంలో నితిన్కు జోడీగా ‘మిరాయ్’ భామ రితిక నాయక్ ఎంపికైన సంగతి తెలిసిందే. మూవీ ప్రారంభోత్సవ వేడుకలో కూడా ఆమె కనిపించింది. ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తాజా సమాచారం. అందుకు కారణాలేంటన్నది తెలియలేదు. కానీ ముహూర్త వేడుకలో పాల్గొన్నాక కథానాయిక వైదొలగడం అరుదుగా జరుగుతుంటుంది. మరి తన పెర్ఫామెన్స్ నచ్చకో, పాత్రకు సూటవ్వదనో మేకర్సే తప్పించారా.. లేక ఆమెనే డేట్లు సర్దుబాటు చేయలేకో, క్యారెక్టర్ నచ్చకో తప్పుకుందా అన్నది తెలియాల్సి ఉంది.
ఏదేమైనప్పటికీ కెరీర్ బాగా మైనస్లో ఉన్న టైంలో ఇలాంటి నెగెటివ్ న్యూస్ నితిన్ సినిమాకు శుభసూచకం కాదు. కాగా రితిక స్థానంలో తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యను తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రావచ్చు. రితిక ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై టీం సభ్యులు కానీ, తను కానీ ఏమని స్పందిస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసే అవకాశముంది.
This post was last modified on June 20, 2026 3:45 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…