Movie News

ఆదర్శంలో ఎలాంటి ఆలస్యం ఉండదు

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం మీద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మూడు వారాల క్రితం వచ్చిన ఒక డబ్బింగ్ సినిమా ఛాయలు కొన్ని ఇందులో ఉండటం వల్ల కొంత భాగం రీ షూట్ జరుగుతోందని, కథలోనూ కొన్ని మార్పులు చేశారని ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు అక్టోబర్ లో విడుదల కావాల్సిన ఈ మూవీ ఏకంగా వెంకీ అనిల్ 5 తర్వాత వస్తుందనే కొత్త గాసిప్ కు శ్రీకారం చుట్టారు.

అయితే అలాంటివేవీ లేవట. ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం ఆదర్శ కుటుంబం ఏకే 47 సెప్టెంబర్ కల్లా మొత్తం పూర్తి చేసుకుని అక్టోబర్ 2 రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. దసరా ఆప్షన్ కూడా పరిశీలించారు కానీ దానికన్నా మొదటి వారం అయితే బెటరని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి. దీని వల్ల థియేటర్ రన్ కు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు నిర్మాత నాగవంశీ త్వరలోనే ఆ లాంఛనం పూర్తి చేయొచ్చు.

స్టోరీ, కంటెంట్ గురించి లీక్స్ సంగతి ఎలా ఉన్నా ఆదర్శ కుటుంబం మీద కుటుంబ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ నటించాలనేది ఆయన అభిమానుల చిరకాల కోరిక. అది నెరవేరుతోంది. ఆయన డైలాగులు రాసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటివి అంత గొప్ప విజయం సాధించినప్పుడు ఇప్పుడు మాటల మాంత్రికుడే మెగా ఫోన్ పట్టుకుంటే దగ్గుబాటి అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంది.

ఎలాగూ అనిల్ రావిపూడి సినిమా 2027 సంక్రాంతికి వచ్చేస్తుంది కాబట్టి దానికి ఆదర్శ కుటుంబంకు కనీసం మూడు నెలల గ్యాప్ ఉండటం అవసరం, నిర్మాతలు ఆ కోణంలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక మంచి ఫ్యామిలీలో ఏకే 47 ప్రవేశించేంత అలజడి ఏం రేగిందనే పాయింట్ మీద దీన్ని రూపొదించారు. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ కొట్టినా గుంటూరు కారం నిరాశ పడటంతో ఇప్పుడు అందరి కళ్ళు త్రివిక్రమ్ మీదే ఉన్నాయి. అంచనాలు అందుకుంటే వసూళ్ల మోతే.

This post was last modified on June 18, 2026 2:37 pm

Share

Recent Posts

నాకు యాక్టింగ్ నేర్పిస్తావా… ఇరుముడి పాపతో ధనుష్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…

7 minutes ago

ఏకగ్రీవాలు జరిగితే MLA టికెట్ ఇవ్వను: జగన్!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…

16 minutes ago

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

3 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

3 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

5 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

6 hours ago