జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ తర్వాత ఏ సినిమా చేస్తాడనే విషయంలో ఎప్పట్నుంచో సస్పెన్స్ నడుస్తోంది. ముందేమో ‘దేవర-2’ అన్నారు. తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇంకోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ కూడా వార్తల్లో నిలుస్తోంది. కానీ ఈ మూడు ప్రాజెక్టుల విషయంలోనూ అయోమయమే కనిపిస్తోంది.
బాలయ్యతో కొత్త సినిమాకు రెడీ అవుతున్న కొరటాల శివ ‘దేవర-2’ విషయంలో అంత సుముఖంగా లేడని చెబుతున్నారు. ‘దేవర-2’ మీద నిర్మాతలకు కూడా అంత నమ్మకం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు త్రివిక్రమ్ సినిమా సంగతి ఎటూ తేలకుండా ఉంది. ఇక నెల్సన్ మూవీ గురించి ఇప్పుడు కొత్త కబురు వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి తారక్ తప్పుకున్నట్లుగా చెబుతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తారక్.. నెల్సన్ సినిమాను చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తారక్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగాడని.. ఆయన స్థానంలోకి తమిళ స్టార్ హీరో సూర్య వచ్చాడని చెబుతున్నారు. సూర్య ఇప్పటికే సితార సంస్థలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా చేస్తూ నాగవంశీతో ఆయనకు మంచి అనుబంధమే ఏర్పడిందని.. దీంతో ఇదే బేనర్లో ఇంకో సినిమా చేయడానికి ఓకే చెప్పారని.. అది నెల్సన్ సినిమానే అని అంటున్నారు. నెల్సన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్-2’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాని తర్వాత రజినీ, కమల్ మల్టీస్టారర్ చేయాల్సి ఉన్నప్పటికీ.. దాని కంటే ముందు సూర్య హీరోగా సితార సంస్థలో సినిమా చేస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావచ్చు.
This post was last modified on June 16, 2026 5:40 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
తమ సినిమాల విడుదలకు ముందు మేకర్స్ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం మామూలే. కానీ అలాంటి స్టేట్మెంట్లు కొన్ని సినిమాల…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…