పెద్ది విషయంలో ప్రీ రిలీజ్ నుంచి పోస్ట్ రిలీజ్ దాకా జరుగుతున్న ఒక పొరపాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దారి తీస్తోంది. అదే దంగల్ తో పోలిక. విడుదలకు ముందు రామ్ చరణ్ ఢిల్లీ, ముంబై ఈవెంట్స్ లో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ సుల్తాన్, అమీర్ ఖాన్ దంగల్ లాంటివి తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పాడు. సంతోషం. నార్త్ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు ఇలాంటివి అవసరమే. కానీ కంటెంట్ పరంగా పోల్చుకోవడానికి ఏ మాత్రం ఆస్కారం లేదనేది గుర్తించాలి.
తాజాగా పెద్ది టీమ్ ని అభినందిస్తూ చిరంజీవి ఒక పాతిక నిమిషాల ఇంటర్వ్యూ చేశారు. దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారుతో పాటు కీలక సభ్యులు అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ దంగల్ ప్రస్తావన తెచ్చారు. అది ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఆధారపడిందని, కానీ పెద్దిలో ఊరి కోసం దేశం కోసం పడే తాపత్రయం ఉందని, అందుకే దీనికి లాంగెటివిటీ ( సుదీర్ఘ థియేటర్ రన్) ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడో లాజిక్ మిస్ అయ్యింది.
దంగల్ ప్రాథమికంగా మొదలయ్యేది ఫ్యామిలీ కోణంలోనే అయినప్పటికీ క్రమంగా అది అమ్మాయిల సాధికారికత, దేశానికి మెడల్స్ తేవడంలో వాళ్ళు చూపించాల్సిన తెగువ లాంటి వాటిని గొప్పగా టచ్ చేస్తుంది. స్ఫూర్తి చెందడానికి బోలెడు ఉంటుంది. అమీర్ ఖాన్ తో సమానంగా ఇద్దరు అమ్మాయిల పాత్రలు గుర్తింపు తెచ్చుకున్నాయి. కుస్తీ అనే పాయింట్ పక్కనపెడితే పెద్ది, దంగల్ మధ్య చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది. పెద్దిలో లవ్ స్టోరీ, క్రికెట్, పరుగు పందెం లాంటి ఇతరత్రా అంశాలు ఉంటాయి.
వీలైనంత వరకు దంగల్ లాంటివి డిస్కషన్ లోకి తేకపోవడం ఉత్తమం. మరొక విషయం ఏంటంటే దంగల్ చైనాలో కూడా భీకరంగా ఆడి వేల కోట్లు వసూలు చేసింది. పెద్దికి అలాంటి ఛాన్స్ ఉందా ఉంటే ఔననీ చెప్పలేం. పైగా ఇందులో కూడా జగపతిబాబు చనిపోయాక ఊరికి గుర్తింపు తేవాలని చరణ్ పోరాటం చేస్తాడు కానీ దేశానికి ఏదో చేయాలని కాదు. దంగల్ హీరో కుటుంబం కోసం చేస్తాడు..ఈ యాంగిల్ లో దంగల్, పెద్దిలో ఒక సారూప్యత అయితే ఉంది. ఇదంతా ఎక్స్, ఇన్స్ టాలో లేనిపోని చర్చకు దారి తీస్తోంది.
This post was last modified on June 14, 2026 12:55 pm
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…
జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయిక.. ఫరియా అబ్దుల్లా. థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అటవీశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన ఒకే ఒక్క ఆలోచన.. 5…