దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని బాగా ఎలివేట్ చేస్తూ, కథానాయకుడిని పొగరుగా చూపించి, అమ్మాయిని ఇలా కూడా ప్రేమించవచ్చా అని కన్విన్సింగ్ గా చెప్పడంలో ఆయన శైలి వేరు. అందుకే తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ నిరాశ పరిచినా మళ్ళీ తన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళ కోసం తీస్తున్నదే స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్.
నిన్న టీజర్ వచ్చేసింది. కథేంటో చూచాయగా చెప్పారు పూరి. రోడ్ల మీద వీధుల అరుగు మీద తలదాచుకునే జాతికి చెందిన వ్యక్తి (విజయ్ సేతుపతి) ని కొన్ని విపరీత పరిస్థితులు ఒక దుర్మార్గుడిని (దునియా విజయ్)ని ఎదిరించేలా చేస్తాయి. కత్తి పట్టేందుకు సైతం వెనుకాడడు. బిచ్చగాడిగా, ఆటో డ్రైవర్ గా, గుడ్డివాడిగా ఇలా రకరకాల రూపాల్లో కనిపిస్తున్న ఈ స్లమ్ వెనుక ఒక లేడీ పోలీస్ (టబు) వెంటపడుతుంది. అసలీ నేర ప్రపంచం ఏమిటో అర్థం కావాలంటే తెరమీద చూడాలి.
రెగ్యులర్ మార్క్ కి భిన్నంగా పూరి కొత్తగా ట్రై చేసిన విధానం కనిపిస్తోంది. ముఖ్యమైన ఆర్టిస్టులను రివీల్ చేసి స్టోరీ గురించి ఎక్కువ క్లూస్ దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. ఒకసారి కళ్ళు లేకుండా కనిపిస్తున్న విజయ్ సేతుపతి మరో సీన్ లో మాములుగా ఉన్నాడు. అంటే ఏదో షాకింగ్ ట్విస్టు దాచి పెట్టారనేది స్పష్టం. సంయుక్త మీనన్ ని మంచి మాస్ టచ్ తో చూపించగా హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా డిఫరెంట్ గా విజువల్స్ కు తగ్గట్టు ఉంది.
స్లమ్ డాగ్ విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. జూలైలోనే ఉండొచ్చని టాక్. త్వరలోనే ప్రకటించబోతున్నారు. పూరికి సాలిడ్ కంబ్యాక్ కావాలి. అది ఈ సినిమాతో నెరవేరుతుందనే నమ్మకం టీమ్ లో బలంగా ఉంది. శ్యాం కె నాయుడు ఛాయాగ్రహణం సమకూర్చారు. తెలుగు హీరో తమిళ దర్శకులను ఎంచుకుంటున్న ట్రెండ్ లో ఒక తమిళ హీరో టాలీవుడ్ డైరెక్టర్ ని నమ్మడం విశేషం. స్లమ్ డాగ్ కనక సక్సెస్ అయితే పూరి మళ్ళీ స్టార్ లీగ్ లోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…