సీనియర్ స్టార్ హీరోలు మరోసారి బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ అయ్యేలా ఉన్నారు. వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇదింకా పూర్తి కాకుండానే వెంకటేష్ ఈ నెలలో అనిల్ రావిపూడి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు. అక్టోబర్ 2 అనుకున్నప్పటికీ ఫైనల్ గా దసరా సందర్భంగా అక్టోబర్ 16 ఆదర్శ కుటుంబం రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందట.
ట్విస్ట్ ఏంటంటే బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ని సైతం దసరాని టార్గెట్ చేసుకునే ఉద్దేశంతోనే చిత్రీకరణ వేగంగా జరుపుతున్నారట. బాలయ్య నాన్ స్టాప్ కోఆపరేషన్ వల్ల ఇది సాధ్యమయ్యేలా ఉందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. గతంలో భగవంత్ కేసరి ఈ ఫెస్టివల్ కే వచ్చి సూపర్ హిట్ అందుకుంది. లియో, టైగర్ నాగేశ్వరరావు లాంటి టఫ్ పోటీని తట్టుకుని ఆ నెలలో విజేతగా నిలిచింది. కలెక్షన్లు అవార్డులు గెలుచుకుంది.
చూస్తుంటే బాలకృష్ణ, వెంకటేష్ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడేలా ఉన్నారు. అయితే జూన్ 10 బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వదలబోయే టీజర్ లో విడుదల తేదీని రివీల్ చేస్తారా లేదానేది ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 16 దాదాపు ఖాయమని యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇదే నిజమైతే మంచి మాస్ ప్లస్ క్లాస్ పోటీని థియేటర్లలో చూడొచ్చు. ఇప్పటికైతే రెండు నిర్మాణ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఆదర్శ కుటుంబం సక్సెస్ వెంకటేష్ కన్నా త్రివిక్రమ్ కే చాలా ముఖ్యం. ఎందుకంటే నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీకి మార్కెట్ జరగాలంటే ఇది చాలా కీలకం. వీరసింహారెడ్డని మించిపోయేలా మూవీ ఇస్తారని బాలయ్య ఫ్యాన్స్ ఆశలను టన్నుల లెక్కల్లో పెంచేసుకున్నారు. వెంకటేష్ ఫ్యాన్స్ సైతం తొలిసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడం పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈసారి ఫన్ తో పాటు క్రైమ్ కూడా ఉంటుందట.
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…
పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల…
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…