పెద్ది వీకెండ్ ఘనంగా పూర్తి చేసుకుంది. టాక్స్, రివ్యూస్, కాంట్రావర్సీ సంగతి ఎలా ఉన్నా జనం థియేటర్లకు పోటెత్తిన మాట వాస్తవం. మొదటి వారాంతానికి రెండు వందల యాభై కోట్లు దాటడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా ఆంధ్ర, గోదావరి జిల్లాల వైపు పెద్దికి బ్రహ్మరథం దక్కుతోంది. సీడెడ్ లోనూ బలంగా ఉంది. నైజామ్ సంగతి సరేసరి. హైదరాబాద్ లో ఆదివారం రోజు మంచి థియేటర్లలో టికెట్ ముక్క మిగల్లేదు. సరే ఇక్కడి దాకా అంత సానుకూలంగా జరిగింది.
అసలు పరీక్ష సోమవారం నుంచి మొదలుకానుంది. పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే విధంగా రెండు ప్రభుత్వాలు జిఓ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సామాన్య ప్రేక్షకుల నుంచి విన్నపం ఏంటంటే వీలైనంత త్వరగా సాధారణ ధరలు అమలు చేస్తే ఎక్కువ శాతం పెద్దిని చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్సుల్లో 177 రూపాయలు ఉన్న టికెట్ ఇప్పుడు 302 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోంది. కుటుంబాలకు ఇదే సమస్య.
చూసేవాళ్ళు చూస్తున్నారుగా అనుకోవచ్చు. నిజమే. కానీ ఇదే స్పీడ్ మాములు రోజుల్లో ఆశించడం కష్టం. ఎందుకంటే జూన్ 12 నుంచి స్కూళ్ళు కాలేజీలు తెరవబోతున్నారు. తల్లితండ్రులకు ఫీజులు, బుక్కులు గట్రా బోలెడు ఖర్చులు ఉంటాయి. ఈ టైంలో సినిమా వ్యవహారం పట్ల అంత సుముఖత చూపించరు. అయినా సరే పెద్దికున్న క్రేజ్ దృష్ట్యా చాలా ఫ్యామిలీస్ మొదటి నాలుగు రోజుల్లోనే చూసేశాయి. ఇంకా చూడాల్సిన కుటుంబాలు లక్షల్లో ఉంటాయి.
సో మరీ పదమూడో తేదీ దాకా కాకుండా కాస్త ముందస్తుగా తగ్గిస్తే బాగుంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో 420 నుంచి 350, సింగల్ స్క్రీన్ 275 నుంచి 200 రూపాయలకు తగ్గించబోతున్నారని సమాచారం. ఇదే విధంగా ఏపీలోనూ తగ్గిస్తే బాగుంటుంది. కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ చేస్తున్నారని తెలిసింది. ఇలా కాకుండా అన్ని సెంటర్లలో ఒకేసారి తగ్గింపుని అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. బయ్యర్ వర్గాలు కోరుకున్నట్టు పెద్దికి లాంగ్ రన్ రావాలంటే ఈ దిశగా ఆలోచించాలి.
This post was last modified on June 7, 2026 11:01 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…