పెద్ది వీకెండ్ ఘనంగా పూర్తి చేసుకుంది. టాక్స్, రివ్యూస్, కాంట్రావర్సీ సంగతి ఎలా ఉన్నా జనం థియేటర్లకు పోటెత్తిన మాట వాస్తవం. మొదటి వారాంతానికి రెండు వందల యాభై కోట్లు దాటడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా ఆంధ్ర, గోదావరి జిల్లాల వైపు పెద్దికి బ్రహ్మరథం దక్కుతోంది. సీడెడ్ లోనూ బలంగా ఉంది. నైజామ్ సంగతి సరేసరి. హైదరాబాద్ లో ఆదివారం రోజు మంచి థియేటర్లలో టికెట్ ముక్క మిగల్లేదు. సరే ఇక్కడి దాకా అంత సానుకూలంగా జరిగింది.
అసలు పరీక్ష సోమవారం నుంచి మొదలుకానుంది. పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే విధంగా రెండు ప్రభుత్వాలు జిఓ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సామాన్య ప్రేక్షకుల నుంచి విన్నపం ఏంటంటే వీలైనంత త్వరగా సాధారణ ధరలు అమలు చేస్తే ఎక్కువ శాతం పెద్దిని చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్సుల్లో 177 రూపాయలు ఉన్న టికెట్ ఇప్పుడు 302 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోంది. కుటుంబాలకు ఇదే సమస్య.
చూసేవాళ్ళు చూస్తున్నారుగా అనుకోవచ్చు. నిజమే. కానీ ఇదే స్పీడ్ మాములు రోజుల్లో ఆశించడం కష్టం. ఎందుకంటే జూన్ 12 నుంచి స్కూళ్ళు కాలేజీలు తెరవబోతున్నారు. తల్లితండ్రులకు ఫీజులు, బుక్కులు గట్రా బోలెడు ఖర్చులు ఉంటాయి. ఈ టైంలో సినిమా వ్యవహారం పట్ల అంత సుముఖత చూపించరు. అయినా సరే పెద్దికున్న క్రేజ్ దృష్ట్యా చాలా ఫ్యామిలీస్ మొదటి నాలుగు రోజుల్లోనే చూసేశాయి. ఇంకా చూడాల్సిన కుటుంబాలు లక్షల్లో ఉంటాయి.
సో మరీ పదమూడో తేదీ దాకా కాకుండా కాస్త ముందస్తుగా తగ్గిస్తే బాగుంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో 420 నుంచి 350, సింగల్ స్క్రీన్ 275 నుంచి 200 రూపాయలకు తగ్గించబోతున్నారని సమాచారం. ఇదే విధంగా ఏపీలోనూ తగ్గిస్తే బాగుంటుంది. కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ చేస్తున్నారని తెలిసింది. ఇలా కాకుండా అన్ని సెంటర్లలో ఒకేసారి తగ్గింపుని అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. బయ్యర్ వర్గాలు కోరుకున్నట్టు పెద్దికి లాంగ్ రన్ రావాలంటే ఈ దిశగా ఆలోచించాలి.
తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఆయన ఇక్కడి టాప్ స్టార్లతో నేరుగా…
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఎలా మార్మోగిందో తెలిసిందే. మహా మహా బ్యాటర్లను వెనక్కి నెట్టి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడుతున్న క్రికెట్ చివరి ఓవర్ కు వచ్చేసింది. బుక్ మై షోలో నిన్నటిదాకా…
తమిళ సినీ పరిశ్రమలో "స్క్రీన్ప్లే కింగ్"గా పేరొందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మృతితో సినీ ప్రపంచం విషాదంలో…
వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేసమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా…
తెలుగులో కేవలం నటనకు పరిమితం కాకుండా.. రైటింగ్, మేకింగ్లోనూ భాగం అవుతూ తన సినిమాలను సక్సెస్ చేసుకునే హీరోల్లో నవీన్…