తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్ తరహా సినిమాలైతే అసలు పాటలే లేకుండా రిలీజవుతుంటాయి. సంగీత ప్రధానంగా సాగే సినిమాల్లో పది పన్నెండు పాటలు కూడా పెడుతుంటారు. ‘అన్నమయ్య’ లాంటి అరుదైన చిత్రాల్లో అంతకుమించిన సంఖ్యలో పాటలు చూశాం. ఐతే ఒక సినిమాలో 200 పాటలుండడం ఎప్పుడైనా చూశామా? ఈ అరుదైన ఘనత ‘సింగ్ గీతం’ సినిమా సాధించిందని అంటున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.
ఈ సినిమాలో మాటలు కూడా పాటల్లాగే వినిపిస్తాయి. అనూహ్య పరిష్థితుల్లో ఒక గ్రామంలోని వాళ్ల మాటలన్నీ పాటలుగా మారిపోతాయి. వాళ్లేం మాట్లాడినా పాటలాగే వినిపిస్తుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.. దీన్నుంచి నుంచి ఊరి వాళ్లు ఎలా బయటపడ్డారన్న కథాంశంతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.
మాటే పాటగా మారే అరుదైన కథాంశంతో సంగీత ప్రధానంగా సాగే ఇలాంటి సినిమాకు సంగీతం అందించడం తన అదృష్టం అంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సినిమా మొత్తం మాటల కంటే పాటలే ఎక్కువగా వినిపిస్తాయని.. ఒక రకంగా ఈ సినిమాలో 200 పాటల దాకా ఉన్నట్లని అతను వ్యాఖ్యానించాడు. ఇండియన్ సినిమాలోనే కాక ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇలాంటి సినిమా రాలేదని అతనన్నాడు.
రెండు దశాబ్దాల కిందటే తనకు సింగీతం ఈ కథ చెప్పినట్లు దేవిశ్రీ వెల్లడించడం విశేషం. ముందు పవన్ కళ్యాణ్ హీరోగా ఏసు క్రీస్తు మీద ఒక సినిమా చేయాలని ఆయన అనుకున్నారని.. ఆ చిత్రానికి తననే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారని.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక కూడా కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయిందని.. ఆ టైంలోనే తనకు ‘సింగ్ గీతం’ ఆలోచన చెప్పారని దేవి వెల్లడించాడు.
కానీ అది కూడా అప్పుడు పట్టాలెక్కలేదని.. చివరికి 2024లో తాను లండన్లో మ్యూజికల్ కన్సర్ట్ కోసం వెళ్లినపుడు సింగీతం తనకు ఫోన్ చేసి, గతంలో చెప్పిన కథను పట్టాలెక్కించే సమయం వచ్చిందని, ఇండియాకు వచ్చాక తనను కలవమని చెప్పారని దేవి తెలిపాడు. వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద సంస్థలో నాగ్ అశ్విన్ ప్రొడక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిసి తానెంతో సంతోషించానని.. ఈ సినిమాకు సంగీతం అందించిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని దేవి చెప్పాడు.
This post was last modified on June 6, 2026 7:43 pm
రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమా 'టాక్సిక్' ట్రైలర్, ప్రోమోలు చూస్తుంటే ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది.…
టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ కొరియోగ్రాఫర్ స్థానానికి గట్టి పోటీదారుల్లో ఒకడు శేఖర్ మాస్టర్. గత దశాబ్ద కాలంలో అతను…
రాజకీయాల్లో ప్రత్యర్తులుగా ఉన్న వారు అన్ని విషయాల్లోనూ కయ్యానికి కాలు రువ్వాల్సిన అవసరం లేదని పలు సందర్భాల్లో తమిళనాడు రాష్ట్ర…
అదేంటో విచిత్రంగా డిసి సినిమాకు తమిళనాడు కంటే ఏపీ తెలంగాణలో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. సోమవారం గ్రాస్ చూసుకుంటే మన…
చిరు లీక్స్ ఎంత పాపులరో తెలిసిందే. తనవి లేదా తన ఫ్యామిలీ సినిమాలు ఏవైనా నిర్మాణంలో ఉన్నప్పుడు అఫీషియల్ గా…
బాక్సాఫీస్ ఫలితం ఏంటనేది పక్కనపెడితే యాక్షన్ సినిమాల్లో విజువల్ గ్రాండియర్ నెస్ తీసుకొచ్చిన మూవీగా సాహోకి ప్రత్యేక స్థానం ఉంటుంది.…