తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఇటీవలే నిర్మాత, ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించే సంకేతం ఇవ్వడంతో సినీ ప్రియుల సంతోషం పట్టరానిదిగా ఉంది. నేడో రేపో ప్రకటన రావడం ఖాయమని ఎదురు చూస్తున్న టైంలో ఆ ఘడియ వచ్చేసింది. ఈ గుడ్ న్యూస్ ప్రపంచానికి పంచుతూ ఏఎంబి యాజమాన్యం అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.
ఇది రాజమౌళి సుదీర్ఘంగా కన్న కల. కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న ఐమాక్స్ దేశంలో అధిక రెవిన్యూ తెచ్చే టాలీవుడ్ కు లేకపోవడం అందరూ లోటుగా ఫీలవుతూ వచ్చారు. ఇప్పుడు అది నెరేవేరే దిశగా అడుగులు పడటం మంచి విషయమే. అసలు విశేషం ఏమిటంటే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఏర్పాటు కాబోయే ఏఎంబి క్లాసిక్ (విక్టరీ) సముదాయంలో ఈ ఐమాక్స్ రాబోతోంది. ఈ మేరకు ఒప్పందం జరిగిందని నిన్నే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో వచ్చింది.
రాబోయే ఏడాది కాలంలో మొత్తం మూడు కొత్త ఐమాక్స్ లు రాబోతున్నాయి. వాటిలో రెండు హైదరాబాద్ కి, మిగిలింది ఇంకో కొత్త నగరానికి ఇస్తారట. 2026 చివర్లో ఏఎంబి క్లాసిక్ కనక మొదలైపోతే విజువల్ గ్రాండియర్ ‘వారణాసి’ని అభిమానులు అందులోనే చూడొచ్చు. మరొకటి 2028 ప్లానింగ్ లో ఉందట. అనుభూతి పరంగా ఐమాక్స్ లో చూసిన ఫీలింగ్ మిగిలిన వాటిలో రాదు. సౌండ్, విజువల్స్, డీటెయిల్స్ దీంట్లో ఇంకో స్థాయిలో ఉంటాయి. అందుకే ఇంత డిమాండ్.
నిర్వహణ పరంగా కూడా ఐమాక్స్ చాలా ఖరీదైన వ్యవహారం. లైసెన్స్ కోసమే లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రొజెక్టర్ విలువ కోట్లలోనే. చిన్న మరమత్తు వచ్చినా దానికయ్యే ఖర్చు మాములుగా ఉండదు. ఇప్పుడున్న రెగ్యులర్ టికెట్ రేట్లతో దాన్ని నడిపించడం అంత సులభంగా ఉండదు కాబట్టి స్పెషల్ క్యాటగిరీకి భావించి ధరలు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. రాజమౌళికే కాదు ఎందరికో స్వప్నంగా ఉన్న ఐమాక్స్ ని దేశమంతా విస్తరించే ప్రణాళికలు జరుగుతున్నాయట.
Gulte Telugu Telugu Political and Movie News Updates