ప్రేమికుల నుంచి నిజ జీవిత భార్యాభర్తలుగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలి. టాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా సెప్టెంబర్ 11 విడుదల తేదీని ఆల్రెడీ అధికారికంగా ప్రకటించింది. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్రం రాకముందు పరిస్థితులను నేపథ్యంగా తీసుకుని మైత్రి మూవీ మేకర్స్ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
అందరిలాగే రణబాలి కూడా చెప్పిన డేటుకి వస్తుందా రాదానే అనుమానాలు రౌడీ బాయ్ అభిమానుల్లో లేకపోలేదు. కానీ టైంకి రావడం ఈ సినిమాకు చాలా అవసరం. ఎందుకంటే రౌడీ జనార్ధన షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతోంది. దాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇంతకు ముందే ప్రకటించారు. ఒకవేళ మిస్ అయితే సంక్రాంతి బరిలో దిగొచ్చు. రణబాలి లేట్ అయితే ఆటోమేటిక్ గా దీన్ని కూడా పుష్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇక్కడితో అయిపోలేదు. హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్ లో ఇటీవలే ఒక మెగా ప్రాజెక్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాన్ని 2027 వేసవి లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారట. డ్రాగన్ లాంటి వాటితో తలపడకుండా మంచి డేట్ సెట్ చేసుకునే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు. ఇవి కాకుండా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ రెడీగా ఉన్నాడని గతంలోనే టాక్ వచ్చింది. గుర్రాల నేపథ్యంలో చాలా డిఫెరెంట్ కాన్సెప్ట్ ఉంటుందట.
అంటే ఒకేసారి నాలుగు సినిమాల ప్లానింగ్ తో విజయ్ దేవరకొండ మాములు స్కెచ్ తో లేడని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ప్లానింగ్ ఎక్కడ మిస్ అయినా, షూటింగులు ఏవైనా ఆలస్యం అయినా ఒకదాని ప్రభావం మరొకదాని మీద పడుతుంది. ఈ నగరానికి ఏమైంది 2 అయ్యాక దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి పెళ్లి చూపులు కాంబో రిపీట్ చేయాలని ట్రై చేస్తున్నారు. విజయ్ కూడా సుముఖంగానే ఉన్నాడు. ముందైతే రణబాలి మొదటి అడుగు విజయవంతంగా పడాలి.
This post was last modified on May 31, 2026 12:29 pm
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…