తెలంగాణ అన్న పదం డిక్షనరీలోనే లేదని.. కొందరు ప్రాంతీయ వాదులు సృష్టించిన పదమని.. ఇటీవల తెలంగాణకు చెందిన కీలక టీడీపీ నాయకుడు బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఉందో లేదో ఆయన చూశాడా? అని ప్రశ్నించారు.
తెలంగాణ వాదులను, తెలంగాణ సమాజాన్ని ఎవరూ అవమానించడానికి వీల్లేదని.. ప్రాంతాలు వేరైనప్పటికీ.. తెలుగు వారు అంతా ఒక్కటేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి వ్యాఖఖ్యలు చేయడం వల్ల.. ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తుందని తెలిపారు.
పార్టీ పుట్టిందే అక్కడ!
తెలుగు దేశం పార్టీ.. పుట్టిందే తెలంగాణ గడ్డపై అని చంద్రబాబు గుర్తు చేశారు. 1982లో తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ ప్రకటించారని.. అప్పటికి ఆయన హైదరాబాద్ గడ్డపైనే ఉన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణ కోసం టీడీపీ అనేక నిర్ణయాలు తీసుకుందన్నారు.
పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుచేసి.. తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించామన్నారు. అదేవిధంగా పలు ప్రాజెక్టులు నిర్మించి.. తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు తాగు, సాగునీటిని అందించిన ఘనత కూడా టీడీపీకే దక్కుతుందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ను ఎన్టీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేసినందుకే ఇప్పుడు ఆ రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్కు కీలక పాత్ర ఉందన్నారు.
తన హయాంలో సైబరాబాద్ వంటి ఒక నగరాన్ని సృష్టించిన విషయాన్ని ప్రస్తావించారు. ఐటీ రంగానికి తెలంగాణను కేంద్రంగా మార్చామని.. ఇదంతా తెలంగాణ అభివృద్ధి కోసమే టీడీపీ ప్రభుత్వం నాడు అనేక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
ఇప్పుడు తెలంగాణ గురించి కొందరు మాట్టాడి.. ఆ రాష్ట్రాన్ని.. టీడీపీని కూడా అవమానించేలా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణ కూడా తెలుగు ప్రజల సొత్తేనని చెప్పారు. అందరూ కలిసి ఉన్నారని.. తర్వాత వద్దనుకుని విడిపోయారని అంతమాత్రాన.. తెలంగాణపై విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. రాజకీయాలు వేరు.. ప్రజల సెంటిమెంటు వేరని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
ఇటీవల నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో తెలంగాణ నుంచి కూడా టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు మాట్టాడుతూ.. తెలంగాణపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నర్సింహులు.. తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదని.. ఇది ప్రాంతీయ వాదులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకువచ్చిన నినాదమని.. కుటుంబాల కోసం పదవులు కట్టబెట్టుకున్నారని.. తెలంగాణ కంటే ఏపీనే మెరుగైన స్థానంలో ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా టీడీపీని ఇరుకున పెట్టాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు తెలంగాణ నాయకులను ఉద్దేశించి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…