Movie News

యాత్ర డైరెక్టర్ మళ్లీ వస్తున్నాడు

పాఠశాల అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మహి.వి.రాఘవ్. కొత్త వాళ్లు నటించిన ఈ రోడ్ ట్రిప్ మూవీకి మంచి రివ్యూలు వచ్చినా కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఐతే తర్వాత హార్రర్ కామెడీ జానర్లో సరికొత్త కథతో రూపొందించిన ‘ఆనందో బ్రహ్మ’తో మహి తొలి విజయాన్నందుకున్నాడు. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా అతనొక పొలిటికల్ బయోపిక్ తీశాడు. అదే.. యాత్ర.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైఎస్ అంటే నచ్చని వాళ్లు కూడా ఈ సినిమా తీసిన విధానాన్ని మెచ్చుకున్నారు. ఆపై మహి అడుగులు డిజిటల్ ఎరేనా వైపు పడ్డాయి. తను క్రియేటర్‌గా ‘సేవ్ ద టైగర్స్’ తీశాడు. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన సీజన్-2 సైతం ఆకట్టుకుంది. కానీ మధ్యలో మహి దర్శకుడిగా దెబ్బ తిన్నాడు.

వైఎస్ జగన్ మీద తీసిన ‘యాత్ర-2’ తుస్సుమంది. జగన్‌కు లేని గొప్పదనాన్ని ఆపాదించి ఈ సినిమా తీయడం.. మరోవైపు ఈ సినిమా తీసినందుకు జగన్ ప్రభుత్వం ద్వారా ఆయాచిత లబ్ధి పొందాలని చూడడంతో మహిపై విమర్శలు తప్పలేదు. ఈ ఫెయిల్యూర్, మీడియాలో వచ్చిన వ్యతిరేక వార్తలతో అన్‌పాపురల్ అయిన మహి.. రెండేళ్లుగా అడ్రస్ లేడు.

ఐతే మహి ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయ్యాడు. తన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ మూడో సీజన్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు మహి. విశేషం ఏంటంటే.. తొలి రెండు సీజన్లలో ప్రేక్షకులను ఎంతో నవ్వించిన ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్యలకు ఈసారి వెన్నెల కిషోర్ తోడవుతున్నాడు.

దీంతో ఫన్ డబులవుతుందని భావిస్తున్నారు. ఈసారి కథలో కొత్త మలుపులు కూడా ఉంటాయని అంటున్నారు. హాట్ స్టార్ వేదికగా త్వరలోనే ‘సేవ్ ద టైగర్స్’ మూడో సీజన్ ప్రసారం కాబోతోంది. మరి ఈ కామెడీ వెబ్ సిరీస్‌తో మళ్లీ సక్సెస్ అందుకుని, ఆ తర్వాత దర్శకుడిగా కొత్త సినిమాను మహి మొదలుపెడతాడేమో చూడాలి.

This post was last modified on May 27, 2026 6:39 pm

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

8 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

55 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago