మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది. బ్లూ కలర్ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర పోజులిస్తూ కుర్రకారుకు షాక్ ఇస్తోంది. సొంత జువెలరీ బ్రాండ్ తమన్నా ఫైన్ జువెలరీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ పిక్స్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మెడలో మినీ ఫ్లిక్ చైన్ తో అదరగొడుతున్న ఈ భామ గ్లామర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ చైన్ కు ఐదు వందలకు పైగా వజ్రాలు పొదిగిన ఆ నగ కన్నా తమన్నా అందమే ఫొటోల్లో ఎక్కువగా హైలైట్ అవుతోంది.
ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా తమన్నా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. రోజురోజుకు మరింత యంగ్ గా కనిపిస్తూ ఇప్పటి తరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఫిట్నెస్ విషయంలో తీసుకునే జాగ్రత్తలే ఈ అందానికి అసలు కారణం అని చెప్పొచ్చు. కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి క్యూట్ లుక్స్ తో ఉందో ఇప్పుడు కూడా అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజా ఫోటోల్లో మత్తుగా చూస్తున్న ఎక్స్ ప్రెషన్స్ కు సోషల్ మీడియాలో లైకుల వర్షం కురుస్తోంది.
గత కొంతకాలంగా తమన్నా కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ కే పరిమితమైన ఈ బ్యూటీ, ఇప్పుడు నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన వెబ్ సిరీస్ లు కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చాయి. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. సౌత్ సినిమాల కన్నా ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్టుల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు లైనప్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.
This post was last modified on May 20, 2026 10:11 pm
Page: 1 2
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు అన్న సామెత ఇప్పుడు ఏపీలోని విపక్షం వైసీపీకి సూటిగా సరిపోతుందని చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్…
ఏపీలో అధికార కూటమి రథసారధిగా ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో గత కొంతకాలంగా ఓ వినూత్న గోల తరచూ…
ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్టాన్ని జెట్ స్పీడుతో అభివృద్ది చేస్తోందంటూ టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పట్టుమని పది రోజులు కూడా కాకముందే.. ఇటు రాజకీయంగా .. అటు పాలన పరంగా..…
వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా.. సంక్షేమ పథకాలను మరింత పెంచి ఇస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
ఎవరిది ఏ కులమో తెలియక్కర్లేదా? అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా కుల గణనను చేపట్టాల్సిన అవసరం ఉందని…