నిన్న అర్ధరాత్రి విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ నాలుగు నిమిషాల టీజర్ సోషల్ మీడియాని కమ్మేసింది. విపరీతమైన అంచనాల నేపథ్యంలో దీన్ని రాగానే చూడాలనే కోరికతో తారక్ అభిమానులతో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్ సైతం మిడ్ నైట్ అని చూడకుండా ఎదురు చూశారు. కథా నేపథ్యం, పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్న నీల్ అసలైన హీరో విజువల్స్ రెండు మూడు షాట్స్, డైలాగులకు పరిమితం చేయడం ముందు ఊహించినట్టే జరిగింది.
అయితే ఇక్కడితో అయిపోలేదు. మొన్న పెద్ది లాగే ఇప్పుడు డ్రాగన్ కు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్, సలార్ ఛాయల్లోనే దీన్ని కూడా తెరకెక్కించిన వైనం స్పష్టం. కానీ ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఓపియం మాఫియా, ఆఫ్గనిస్తాన్ క్రైమ్ వరల్డ్, గోల్డెన్ ట్రయాంగిల్ సామ్రాజ్యం తదితరాలు కొత్తగా ఉన్నాయి. కాకపోతే నీల్ తనకు అలవాటైన డార్క్ అండ్ వయొలెంట్ టోన్ లో చూపించడం రెగ్యులర్ ఆడియన్స్ తో జస్ట్ ఓకే అనిపించుకుంది.
మరో సమస్య ఏమిటంటే మొదటి రెండు నిమిషాల్లో ఏఐ ఎక్కువగా వాడారు. జనం గుర్తుపట్టేలా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఉద్దేశం వేరు. స్టోరీ బ్యాక్ డ్రాప్ ని ముందే పరిచయం చేసే ఉద్దేశంతో ఆ ఫుటేజ్ కట్ చేయించారు. అయితే విఎఫ్ఎక్స్ లో మరింత క్వాలిటీ ఉంటే బాగుండేది. తర్వాత వచ్చే విజువల్స్ చాలా రిచ్ గా, రియలిస్టిక్ గా ఉన్నాయి. లూగర్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో సలార్ లో ప్రభాస్ పోలికలు వచ్చేలా ఉండటం ఒకరకంగా రిస్క్ అయిపోయింది.
ఇంకా సినిమా విడుదలకు ఏడాది ఉంది. షూటింగ్ సగం కూడా అవ్వలేదు. చాలా సమయం చేతిలో ఉంది కనక ప్రశాంత్ నీల్ కు ఆన్ లైన్ లో వస్తున్న ఫీడ్ బ్యాక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తనతో పాటు తారక్ ని వినూత్నంగా ఆవిష్కరించడానికి నీల్ కి ఇదో మంచి ఛాన్స్. గత బ్లాక్ బస్టర్ల షేడ్స్ కనిపించకుండా కొత్తగా చూపిస్తే రికార్డుల పరంగా అద్భుతాలు జరిగిపోతాయి. మరో కీలకమైన కంటెంట్ ప్రమోషన్ రూపంలో బయటికి రావాలంటే ఇంకో అయిదారు నెలలు చూడాల్సిందే.
This post was last modified on May 20, 2026 10:51 am
ఇండియన్ సినిమా హిస్టరీలోనే గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన ఏఆర్ రెహమాన్.. ఇంతకుముందులా మెరుపులు మెరిపించలేకపోతున్నాడని ఆయన అభిమానులే అసంతృప్తి…
లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి కొన్నేళ్ల నుంచి చర్చ జరుగుతోంది. 2022, 2023 సీజన్లలోనే…
తిరుమల శ్రీవారిని ఒక్క నిమిషం దర్శించుకోవాలని పరితపించే భక్తులు కోట్లలో ఉంటారు. అలానే తిరుమల ప్రసాదాన్ని పరమపవిత్రంగా కూడా భావిస్తారు.…
టాలీవుడ్ సినీ సర్కిల్స్లో ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ పేరు ఇటీవల ఎలా మార్మోగిందో తెలిసిందే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా,…
భూమా ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి గుర్తింపే ఉంది. అయితే దివంగత భూమా నాగిరెడ్డి మరణానికి ముందే… ఆయన సతీమణి భూమా…
కాపు సామాజిక వర్గాన్ని తటస్థం చేయాలన్న దిశగా వైసీపీ అడుగులు వేగంగా పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం…