నిన్న అర్ధరాత్రి విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ నాలుగు నిమిషాల టీజర్ సోషల్ మీడియాని కమ్మేసింది. విపరీతమైన అంచనాల నేపథ్యంలో దీన్ని రాగానే చూడాలనే కోరికతో తారక్ అభిమానులతో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్ సైతం మిడ్ నైట్ అని చూడకుండా ఎదురు చూశారు. కథా నేపథ్యం, పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్న నీల్ అసలైన హీరో విజువల్స్ రెండు మూడు షాట్స్, డైలాగులకు పరిమితం చేయడం ముందు ఊహించినట్టే జరిగింది.
అయితే ఇక్కడితో అయిపోలేదు. మొన్న పెద్ది లాగే ఇప్పుడు డ్రాగన్ కు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్, సలార్ ఛాయల్లోనే దీన్ని కూడా తెరకెక్కించిన వైనం స్పష్టం. కానీ ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఓపియం మాఫియా, ఆఫ్గనిస్తాన్ క్రైమ్ వరల్డ్, గోల్డెన్ ట్రయాంగిల్ సామ్రాజ్యం తదితరాలు కొత్తగా ఉన్నాయి. కాకపోతే నీల్ తనకు అలవాటైన డార్క్ అండ్ వయొలెంట్ టోన్ లో చూపించడం రెగ్యులర్ ఆడియన్స్ తో జస్ట్ ఓకే అనిపించుకుంది.
మరో సమస్య ఏమిటంటే మొదటి రెండు నిమిషాల్లో ఏఐ ఎక్కువగా వాడారు. జనం గుర్తుపట్టేలా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఉద్దేశం వేరు. స్టోరీ బ్యాక్ డ్రాప్ ని ముందే పరిచయం చేసే ఉద్దేశంతో ఆ ఫుటేజ్ కట్ చేయించారు. అయితే విఎఫ్ఎక్స్ లో మరింత క్వాలిటీ ఉంటే బాగుండేది. తర్వాత వచ్చే విజువల్స్ చాలా రిచ్ గా, రియలిస్టిక్ గా ఉన్నాయి. లూగర్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో సలార్ లో ప్రభాస్ పోలికలు వచ్చేలా ఉండటం ఒకరకంగా రిస్క్ అయిపోయింది.
ఇంకా సినిమా విడుదలకు ఏడాది ఉంది. షూటింగ్ సగం కూడా అవ్వలేదు. చాలా సమయం చేతిలో ఉంది కనక ప్రశాంత్ నీల్ కు ఆన్ లైన్ లో వస్తున్న ఫీడ్ బ్యాక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తనతో పాటు తారక్ ని వినూత్నంగా ఆవిష్కరించడానికి నీల్ కి ఇదో మంచి ఛాన్స్. గత బ్లాక్ బస్టర్ల షేడ్స్ కనిపించకుండా కొత్తగా చూపిస్తే రికార్డుల పరంగా అద్భుతాలు జరిగిపోతాయి. మరో కీలకమైన కంటెంట్ ప్రమోషన్ రూపంలో బయటికి రావాలంటే ఇంకో అయిదారు నెలలు చూడాల్సిందే.
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…