నిన్న అర్ధరాత్రి విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ నాలుగు నిమిషాల టీజర్ సోషల్ మీడియాని కమ్మేసింది. విపరీతమైన అంచనాల నేపథ్యంలో దీన్ని రాగానే చూడాలనే కోరికతో తారక్ అభిమానులతో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్ సైతం మిడ్ నైట్ అని చూడకుండా ఎదురు చూశారు. కథా నేపథ్యం, పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్న నీల్ అసలైన హీరో విజువల్స్ రెండు మూడు షాట్స్, డైలాగులకు పరిమితం చేయడం ముందు ఊహించినట్టే జరిగింది.
అయితే ఇక్కడితో అయిపోలేదు. మొన్న పెద్ది లాగే ఇప్పుడు డ్రాగన్ కు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్, సలార్ ఛాయల్లోనే దీన్ని కూడా తెరకెక్కించిన వైనం స్పష్టం. కానీ ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఓపియం మాఫియా, ఆఫ్గనిస్తాన్ క్రైమ్ వరల్డ్, గోల్డెన్ ట్రయాంగిల్ సామ్రాజ్యం తదితరాలు కొత్తగా ఉన్నాయి. కాకపోతే నీల్ తనకు అలవాటైన డార్క్ అండ్ వయొలెంట్ టోన్ లో చూపించడం రెగ్యులర్ ఆడియన్స్ తో జస్ట్ ఓకే అనిపించుకుంది.
మరో సమస్య ఏమిటంటే మొదటి రెండు నిమిషాల్లో ఏఐ ఎక్కువగా వాడారు. జనం గుర్తుపట్టేలా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఉద్దేశం వేరు. స్టోరీ బ్యాక్ డ్రాప్ ని ముందే పరిచయం చేసే ఉద్దేశంతో ఆ ఫుటేజ్ కట్ చేయించారు. అయితే విఎఫ్ఎక్స్ లో మరింత క్వాలిటీ ఉంటే బాగుండేది. తర్వాత వచ్చే విజువల్స్ చాలా రిచ్ గా, రియలిస్టిక్ గా ఉన్నాయి. లూగర్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో సలార్ లో ప్రభాస్ పోలికలు వచ్చేలా ఉండటం ఒకరకంగా రిస్క్ అయిపోయింది.
ఇంకా సినిమా విడుదలకు ఏడాది ఉంది. షూటింగ్ సగం కూడా అవ్వలేదు. చాలా సమయం చేతిలో ఉంది కనక ప్రశాంత్ నీల్ కు ఆన్ లైన్ లో వస్తున్న ఫీడ్ బ్యాక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తనతో పాటు తారక్ ని వినూత్నంగా ఆవిష్కరించడానికి నీల్ కి ఇదో మంచి ఛాన్స్. గత బ్లాక్ బస్టర్ల షేడ్స్ కనిపించకుండా కొత్తగా చూపిస్తే రికార్డుల పరంగా అద్భుతాలు జరిగిపోతాయి. మరో కీలకమైన కంటెంట్ ప్రమోషన్ రూపంలో బయటికి రావాలంటే ఇంకో అయిదారు నెలలు చూడాల్సిందే.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…