తెలుగులో గత నాలుగైదేళ్లలో అత్యధిక సంఖ్యలో పెద్ద సినిమాలు చేసిన హీరోయిన్ శ్రీలీలనే. ఐతే ఆమె సక్సెస్ రేట్ మాత్రం దారుణం. ఆమె నటించిన చిత్రాలు రెండంకెల సంఖ్యలో ఉండగా.. ధమాకా, భగవంత్ కేసరి మినహాయిస్తే అన్నీ ఫ్లాపే అయ్యాయి. కానీ ఆమెకు అవకాశాలేమీ ఆగడం లేదు. చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కనిపించింది శ్రీలీల. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఐతే శ్రీలీలకు ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తున్నప్పటికీ.. ఆమె తనకు తానుగా సినిమాలు తగ్గించుకుందని, ఇంతకుముందంత బిజీగా లేదని అంటున్నారు. తన చదువు కోసమే శ్రీలీల కాల్ షీట్స్ తగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల కిందటే ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
ఐతే సినిమాల్లో ఇంత బిజీగా ఉంటూ శ్రీలీల ఎంబీబీఎస్ ఎలా పూర్తి చేసిందో అని అందరూ ఆశ్చర్యపోయారు. ఎంబీబీఎస్ అంటే మిగతా డిగ్రీల్లా ఆషామాషీగా ఉండదు. క్లాసులకు పోకుండా అల్లాటప్పాగా డిగ్రీ వచ్చేయదు. మరి శ్రీలీల ఎలా మేనేజ్ చేసిందో, ఎంబీబీఎస్లో ఎంత నైపుణ్యం సంపాదించిందో అంటూ సోషల్ మీడియాలో ఆమె మీద కౌంటర్లు కూడా పడ్డాయి. అదే సమయంలో ఆమె కమిట్మెంట్ను కొనియాడిన వాళ్లూ ఉన్నారు.
ఐతే ఏదో మొక్కుబడిగా ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకుని పేరు వెనుక ‘డాక్టర్’ తగిలించుకోవడం కాదని, ఇక ముందు కూడా చదువు కొనసాగించాలని శ్రీలీల భావిస్తోందట. ఇందులో భాగంగానే పీజీ స్పెషలైజేషన్ చేయాలని శ్రీలీల పట్టుదలతో ఉందట.
పీజీ ఎంట్రన్స్ రాయడం కోసం ఆమె ప్రిపేర్ అవుతోందట. శ్రీలీల డేటింగ్ అంటూ ఒక రూమర్ బయటికి వచ్చిన నేపథ్యంలో దాన్ని ఖండించిన ఆమె తల్లి కూడా తన కూతురు పీజీ ఎంట్రన్స్ కోసం ప్రిపేరవుతున్న విషయాన్ని ధ్రువీకరించింది. చూస్తుంటే శ్రీలీల పీజీ కూడా చేసి, ఫిలిం కెరీర్ ముగిశాక ఫుల్ టైం ప్రాక్టీస్ మొదలుపెట్టేలా కనిపిస్తోంది.
This post was last modified on May 18, 2026 2:04 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…