బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన కియారా అద్వానీ.. కెరీర్ పీక్స్లో ఉండగానే తన సహ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ సంగతి తెలిసిందే. అలా అని ఆమె సినిమాలేమీ వదిలేయలేదు. టాప్ ఫామ్ను కొనసాగిస్తోంది. గత ఏడాది ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా ఆమె కెరీర్లో దూసుకెళ్తోంది.
పెళ్లి తర్వాత కూడా ఫుల్ గ్లామరస్ రోల్స్ చేస్తూ తాను ఆధునిక అమ్మాయిని అని చాటుతున్న కియారా.. తాజాగా ఒక పాడ్ కాస్ట్లో కూతురు సరయా విషయంలోనూ అంతే ఆధునికంగా ఉంటానంటూ చేసిన కొన్ని కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
ప్రస్తుతం సమాజంలోని అబ్బాయిల గురించి మీ అమ్మాయికి ఏం చెప్తారని హోస్ట్ ప్రశ్నించగా.. అందుకు కియారా ఇచ్చిన జవాబు విమర్శలకు దారి తీసింది. తన కూతురు ఎంత మందితోనైనా డేటింగ్ చేయొచ్చని, వారిలో ఎవ్వరినీ పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదని ఆమె కామెంట్ చేసింది.
‘‘నా కూతురు ఫుల్ లైఫ్ చూడాలని అనుకుంటా. ఆమె ఒక్క వ్యక్తితోనే డేటింగ్ చేయాలని లేదు. ఆమెపై ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలాగే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. మన రిలేషన్షిప్స్ విషయంలో పశ్చాత్తాపం అవసరం లేదు. ఎదిగే క్రమంలో ఈ రిలేషన్షిప్స్ అన్నీ పాఠాలు నేర్పిస్తాయి. మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు’’ అని కియారా వ్యాఖ్యానించింది.
ఐతే ఈ వ్యాఖ్యలపై సంప్రదాయ వాదులు మండిపడుతున్నారు. ఇదేనా మన కల్చర్..పిల్లలకు ఇదేనా నేర్పించేది అని ప్రశ్నిస్తున్నారు. రిలేషన్షిప్స్ను ఇంత తేలిగ్గా తీసుకోవడం.. ఎంతమందితో అయినా డేట్ చేయమని ఒక తల్లి చెప్పడం కరెక్టా అని అడుగుతున్నారు. ఐతే కియారా చెప్పిన దాంట్లో తప్పేముందని.. కాలం ఎంతో మారిందని, అందులోనూ కియారా కూతురు ఎదిగే సమయానికి ఉండే పరిస్థితులకు తగ్గట్లే కియారా మాట్లాడుతోందని ఆమెను కొందరు సమర్థిస్తున్నారు.
This post was last modified on May 16, 2026 2:44 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…