యువ కథానాయకుడు రామ్ పోతినేని తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు. తన కొత్త సినిమాను అనౌన్స్ చేస్తూ.. దీనికి తనే రచయిత-దర్శకుడు అని ప్రకటించాడు. ఈ చిత్రంలో రామ్ ‘వీర’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ముఖం చూపించకుండా బ్యాక్ లుక్తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా ప్రి లుక్ పోస్టర్ డిజైన్ చేయించుకున్నాడు రామ్.
ఒక మాస్ హీరో ఇలా తనే సొంతంగా కథ రాసుకుని డైరెక్ట్ చేయడం అన్నది అరుదైన విషయమే. పైగా ఇదేమీ రెగ్యులర్ మాస్ మసాలా సినిమా కూడా కాదట. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు. మరి మాస్ సినిమాలకు పెట్టింది పేరైన రామ్.. స్వీయ దర్శకత్వంలో ఇలాంటి వైవిధ్యమైన సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. రామ్ సోదరుడైన కృష్ణ పోతినేని ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు. కాబట్టి ఇది అసలైన రామ్ ‘సొంత’ సినిమాగా చెప్పొచ్చు. ఐతే రామ్కు ఇప్పటికే ఒక హోం బేనర్ ఉంది. అదే.. స్రవంతి మూవీస్. అది రామ్ పెదనాన్న, లెజెండరీ ప్రొడ్యూసర్ రవికిషోర్ది.
ఆ బేనర్ మీద ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారాయన. రామ్తోనూ రెడీ, ఎందుకంటే ప్రేమంట, శివమ్, నేను శైలజ, రెడ్.. ఇలా చాలా సినిమాలు తీశారు రవికిషోర్. ఐతే ఆ బేనర్ ఉండగా.. రామ్ సొంతంగా వేరే బేనర్ పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
కొన్నేళ్లుగా రవికిషోర్ సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. రామ్ కెరీర్లో కూడా జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఐతే బాబాయితో చెడి రామ్ సొంత బేనర్ మొదలుపెట్టాడా అనే చర్చ జరుగుతోంది.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణం జూదంలా మారిపోయిన నేపథ్యంలో నిర్మాతగా తాను ఇమడలేనన్న ఉద్దేశంతోనే రవికిషోర్ ప్రొడక్షన్కు దూరంగా ఉన్నారని.. అందుకే రామ్ సొంతంగా బేనర్ పెట్టుకుని సినిమా చేయాల్సి వస్తోందని.. అంతకుమించి బాబాయితో గొడవలేమీ లేవని తెలుస్తోంది.
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…