యువ కథానాయకుడు రామ్ పోతినేని తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు. తన కొత్త సినిమాను అనౌన్స్ చేస్తూ.. దీనికి తనే రచయిత-దర్శకుడు అని ప్రకటించాడు. ఈ చిత్రంలో రామ్ ‘వీర’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ముఖం చూపించకుండా బ్యాక్ లుక్తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా ప్రి లుక్ పోస్టర్ డిజైన్ చేయించుకున్నాడు రామ్.
ఒక మాస్ హీరో ఇలా తనే సొంతంగా కథ రాసుకుని డైరెక్ట్ చేయడం అన్నది అరుదైన విషయమే. పైగా ఇదేమీ రెగ్యులర్ మాస్ మసాలా సినిమా కూడా కాదట. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు. మరి మాస్ సినిమాలకు పెట్టింది పేరైన రామ్.. స్వీయ దర్శకత్వంలో ఇలాంటి వైవిధ్యమైన సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. రామ్ సోదరుడైన కృష్ణ పోతినేని ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు. కాబట్టి ఇది అసలైన రామ్ ‘సొంత’ సినిమాగా చెప్పొచ్చు. ఐతే రామ్కు ఇప్పటికే ఒక హోం బేనర్ ఉంది. అదే.. స్రవంతి మూవీస్. అది రామ్ పెదనాన్న, లెజెండరీ ప్రొడ్యూసర్ రవికిషోర్ది.
ఆ బేనర్ మీద ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారాయన. రామ్తోనూ రెడీ, ఎందుకంటే ప్రేమంట, శివమ్, నేను శైలజ, రెడ్.. ఇలా చాలా సినిమాలు తీశారు రవికిషోర్. ఐతే ఆ బేనర్ ఉండగా.. రామ్ సొంతంగా వేరే బేనర్ పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
కొన్నేళ్లుగా రవికిషోర్ సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. రామ్ కెరీర్లో కూడా జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఐతే బాబాయితో చెడి రామ్ సొంత బేనర్ మొదలుపెట్టాడా అనే చర్చ జరుగుతోంది.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణం జూదంలా మారిపోయిన నేపథ్యంలో నిర్మాతగా తాను ఇమడలేనన్న ఉద్దేశంతోనే రవికిషోర్ ప్రొడక్షన్కు దూరంగా ఉన్నారని.. అందుకే రామ్ సొంతంగా బేనర్ పెట్టుకుని సినిమా చేయాల్సి వస్తోందని.. అంతకుమించి బాబాయితో గొడవలేమీ లేవని తెలుస్తోంది.
This post was last modified on May 15, 2026 4:37 pm
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…