రామాయణం.. సాయి పల్లవి ‘మాటే’ రిస్కా…

‘రామాయణం’ సెట్స్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో సీతగా సాయిపల్లవిని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె వాయిస్ మీదే మేకర్స్‌కు డౌట్ వచ్చిందట. రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘ఏక్ దిన్’ సినిమాలో సాయిపల్లవి హిందీ డైలాగ్స్, యాస మీద ట్రోల్స్ వచ్చాయి. దీంతో రామాయణం టీమ్ ఆమె డైలాగ్స్‌కు డబ్బింగ్ చెప్పించాలని ఆలోచిస్తున్నారనే టాక్ బయటకు వచ్చింది.

ఇక్కడ అసలు ఇష్యూ ‘ఏక్ దిన్’ ఫెయిల్యూర్ కాదు. ఆ సినిమా ఆడలేదు, పోయింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో, అందులోనూ సీతమ్మ తల్లి లాంటి ఎమోషనల్ క్యారెక్టర్‌కు హిందీ డెలివరీ చాలా కీలకం. రామాయణం కథ నార్త్ ఆడియన్స్‌కు సెంటిమెంట్. ఒక్క మాట తేడా కొట్టినా సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అందుకే నితేష్ తివారీ టీమ్ రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదట. సీతమ్మ పాత్రకు క్లియర్, పాలిష్డ్ హిందీ కావాలి, యాస డామినేట్ చేయకూడదు అనేది వాళ్ల ఆలోచన.

ఈ నిర్ణయం వలన సాయిపల్లవిని తక్కువ చేసినట్లు కాదు. ఆమె నటనకు ఎవరూ మ్యాచ్ కాదు. కానీ 4 కోట్ల బడ్జెట్, 3 పార్ట్‌లుగా వస్తున్న సినిమాకు ప్రతి చిన్న విషయం కౌంట్ అవుతుంది. ఇంతకుముందు ‘ఆదిపురుష్’ తప్పుల వలన ఊహించని దెబ్బ పడింది. ఆ తప్పు రిపీట్ కాకూడదని మేకర్స్ ముందు జాగ్రత్త పడుతున్నారు. హాలీవుడ్‌లో కూడా పెద్ద యాక్టర్స్‌కు యాక్సెంట్ కోచ్‌లు ఉంటారు, వాయిస్ డబ్ చేస్తారు. ఇది కామన్ ప్రాక్టీస్.

ఇప్పుడున్న ఆప్షన్స్ రెండే. ఒకటి సాయిపల్లవికి 6 నెలలు స్ట్రిక్ట్ హిందీ ట్రైనింగ్ ఇవ్వడం. రెండు, బాలీవుడ్‌లో మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో వాయిస్ చెప్పించడం. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు హిందీ వర్షన్‌లో శరద్ కేల్కర్ డబ్ చెప్పాడు. సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఎవరూ ‘ఇది ప్రభాస్ వాయిస్ కాదు’ అని పట్టించుకోలేదు. కథ, ఎమోషన్ కనెక్ట్ అయితే చాలు. రామాయణం టీమ్ కూడా అదే చూస్తోంది. ఇంకా అఫీషియల్‌గా ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం స్క్రీన్ టెస్ట్, వాయిస్ టెస్ట్ రెండూ జరుగుతున్నాయని టాక్. సాయిపల్లవి కూడా కథ కోసం ఏదైనా చేసే టైప్. ఒకవేళ డబ్బింగ్ చెప్పినా ఆమె నటన, ఎక్స్‌ప్రెషన్స్ మారవు. చివరికి జనాలకు కావాల్సింది సీతమ్మగా కనిపించాలి, వినిపించాలి. ఆ ఫీల్ మిస్ అవ్వకూడదు. ఇక 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్ రానుంది.