గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సింపుల్ మెజారిటీ సాధించకపోవడంతో విజయ్ సీఎం పదవి చేపట్టడంలో ఇబ్బందులు తప్పలేదు.
ఐతే నాలుగైదు రోజుల డ్రామా తర్వాత ఆదివారం ప్రమాణ స్వీకారం చేశాడు మరి అసెంబ్లీలో బుధవారం జరిగే బలపరీక్షలో విజయ్ నెగ్గగలడా లేదా అన్న సందేహాలు నెలకొనగా.. అనుకున్న దాని కంటే ఎక్కువగా, 144 మంది సభ్యుల మద్దతు లభించడం విశేషం.
అన్నాడీఎంకే పార్టీ రెబల్ నేత తన వెంట నడిచిన ఎమ్మెల్యేలతో తన ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడంతో విజయ్కి ఏ ఇబ్బందీ లేకపోయింది. కానీ దీని వెనుక వేరే రాజకీయం ఉందంటూ పెద్ద డిస్కషన్ నడుస్తోందిప్పుడు.
తనకు మద్దతుగా నిలవాలంటూ విజయ్.. టీవీ షణ్ముగం ఇంటికి వెళ్లి కోరిన సమయంలో ఆయన ఇంట్లో ఒక కొత్త సోఫా ఉంది.
అది విజయ్ రావడానికి ముందే డెలివరీ కావడం విశేషం. సంబంధిత విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది జస్ట్ కుషన్ ఉన్న సోఫా కాదని, అందులో భారీ మొత్తంలో డబ్బు ఉందని ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమా చూసిన వాళ్లకు ఈ సోఫా పాలిటిక్స్ గురించి బాగానే అవగాహన ఉంటుంది.
ఆ చిత్రంలో అల్లు అర్జున్ ఇలాగే సోఫా ద్వారా రాజకీయ నాయకులకు డబ్బులు పంపించి చక్రం తిప్పుతాడు. ఆ సినిమా నుంచి విజయ్ పార్టీ స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఈ విషయం అసెంబ్లీ వరకు వెళ్లడం, అక్కడ కూడా పుష్ప ప్రస్తావన రావడం విశేషం.
ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో సోఫా సీన్ను ఇప్పుడు అధికార పార్టీ రీక్రియేట్ చేసిందని.. కొత్త రాజకీయం చేస్తాం, మార్పు తీసుకొస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇలాగేనా రాజకీయం చేసేది అని ఉదయనిధి ప్రశ్నించాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడి ఇంటికి అధికార పార్టీ అధినేత వెళ్తాడు.. ఆయన వెళ్లడానికి ముందు కొత్త సోఫా ఆ ఇంటికి చేరుతుంది అంటూ ఉదయనిధి కౌంటర్ వేశాడు.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…