ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని కనక సింగల్ స్క్రీన్లలో వేయనివ్వని పరిస్థితి వస్తే ముందు చిరంజీవి దగ్గరికి వెళ్తామని, అలాగే రామ్ చరణ్ ని కలిసి విన్నవిస్తామని అనేశారు. నిజానికి నేను ఇండస్ట్రీ పెద్దని కాదని మెగాస్టార్ ఎప్పుడో చెప్పారు. ఏదైనా అవసరం ఉంటే చొరవ తీసుకుంటారు తప్పించి తానుగా అన్ని వ్యవహారాల్లో కలగగేసుకునే ధోరణి ఎప్పుడూ ప్రదర్శించలేదు.
ఇప్పుడు వచ్చింది చాలా సున్నితమైన సమస్య. అందరూ చిరంజీవికి కావాల్సిన వాళ్ళే. దిల్ రాజుని పిలిపించి ఇదేంటి ఇలా చేస్తున్నారని నిలదీయలేరు. ఎందుకంటే ఎగ్జిబిటర్లందరూ ముందుకొచ్చి మా గోడు వినండి మహాప్రభో అంటూ తమ వెర్షన్ వినిపిస్తారు. లేదూ ఇటు మైత్రి, సితార వాళ్లకు సర్దిచెబుదామంటే కొడుకు సినిమా కాబట్టి ఇలా మధ్యవర్తిత్వం చేస్తున్నారనే కామెంట్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ట్రేడ్ కు సంబంధించిన వివాదాలను నటులు పరిష్కరించలేరు.
పైగా చిరంజీవి నిర్మాత కాదు, దర్శకుడు అంతకన్నా కాదు. చేతిలో అల్లు అరవింద్ లాగా థియేటర్లు లేవు. అలాంటప్పుడు ఈ రంగం మీద పట్టు ఉంటుందని చెప్పడానికి లేదు. ఏదో మాట సాయం వరకు ఓకే కానీ ఒకరికి ఇలాగే చేయమని చెప్పే అనవసర చొరవ తీసుకోరనే అనిపిస్తుంది. పెద్ది ఎంత తన బిడ్డ సినిమా అయినప్పటికీ న్యూట్రల్ గా ఆలోచిస్తే ఎవరివైపు నిలబడలేని పరిస్థితి కనిపిస్తుంది. సో మధ్యేమార్గంగా తమ్మారెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా కలగజేసుకుంటారేమో చూడాలి.
ఎవరు రంగంలోకి దిగినా దిగకపోయినా ముందైతే ఇది సాల్వ్ కావాలి. ఎవరో ఒకరు సొల్యూషన్ కోసం అడుగులు వేయాలి. ఇప్పటికైతే మేమంటే మేము రైట్ అనే వాదన ఇరు వర్గాల్లోనూ కనిపిస్తోంది. ఒకవేళ చిరంజీవి కనక పెద్దగా ముందుకు వచ్చారంటే పెద్దికి మంచిదే. కానీ అలా జరుగుతుందా అంటే డౌటే. రాబోయే వారం రోజులు చాలా కీలకం కాబోతున్నాయి. సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సోషల్ మీడియా మూవీ లవర్స్ కి మంచి కంటెంట్ అయితే దొరికేసింది.
This post was last modified on May 13, 2026 9:36 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…