ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని కనక సింగల్ స్క్రీన్లలో వేయనివ్వని పరిస్థితి వస్తే ముందు చిరంజీవి దగ్గరికి వెళ్తామని, అలాగే రామ్ చరణ్ ని కలిసి విన్నవిస్తామని అనేశారు. నిజానికి నేను ఇండస్ట్రీ పెద్దని కాదని మెగాస్టార్ ఎప్పుడో చెప్పారు. ఏదైనా అవసరం ఉంటే చొరవ తీసుకుంటారు తప్పించి తానుగా అన్ని వ్యవహారాల్లో కలగగేసుకునే ధోరణి ఎప్పుడూ ప్రదర్శించలేదు.
ఇప్పుడు వచ్చింది చాలా సున్నితమైన సమస్య. అందరూ చిరంజీవికి కావాల్సిన వాళ్ళే. దిల్ రాజుని పిలిపించి ఇదేంటి ఇలా చేస్తున్నారని నిలదీయలేరు. ఎందుకంటే ఎగ్జిబిటర్లందరూ ముందుకొచ్చి మా గోడు వినండి మహాప్రభో అంటూ తమ వెర్షన్ వినిపిస్తారు. లేదూ ఇటు మైత్రి, సితార వాళ్లకు సర్దిచెబుదామంటే కొడుకు సినిమా కాబట్టి ఇలా మధ్యవర్తిత్వం చేస్తున్నారనే కామెంట్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ట్రేడ్ కు సంబంధించిన వివాదాలను నటులు పరిష్కరించలేరు.
పైగా చిరంజీవి నిర్మాత కాదు, దర్శకుడు అంతకన్నా కాదు. చేతిలో అల్లు అరవింద్ లాగా థియేటర్లు లేవు. అలాంటప్పుడు ఈ రంగం మీద పట్టు ఉంటుందని చెప్పడానికి లేదు. ఏదో మాట సాయం వరకు ఓకే కానీ ఒకరికి ఇలాగే చేయమని చెప్పే అనవసర చొరవ తీసుకోరనే అనిపిస్తుంది. పెద్ది ఎంత తన బిడ్డ సినిమా అయినప్పటికీ న్యూట్రల్ గా ఆలోచిస్తే ఎవరివైపు నిలబడలేని పరిస్థితి కనిపిస్తుంది. సో మధ్యేమార్గంగా తమ్మారెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా కలగజేసుకుంటారేమో చూడాలి.
ఎవరు రంగంలోకి దిగినా దిగకపోయినా ముందైతే ఇది సాల్వ్ కావాలి. ఎవరో ఒకరు సొల్యూషన్ కోసం అడుగులు వేయాలి. ఇప్పటికైతే మేమంటే మేము రైట్ అనే వాదన ఇరు వర్గాల్లోనూ కనిపిస్తోంది. ఒకవేళ చిరంజీవి కనక పెద్దగా ముందుకు వచ్చారంటే పెద్దికి మంచిదే. కానీ అలా జరుగుతుందా అంటే డౌటే. రాబోయే వారం రోజులు చాలా కీలకం కాబోతున్నాయి. సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సోషల్ మీడియా మూవీ లవర్స్ కి మంచి కంటెంట్ అయితే దొరికేసింది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…