వరస డిజాస్టర్ల దెబ్బకు కొంత బ్రేక్ తీసుకున్న నితిన్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెడుతున్నాడు. డెబ్యూ దర్శకులను నమ్మి ఇటీవలే కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే గతంలో వదులుకున్న ప్రాజెక్టుల విషయాలు ఇప్పుడు మరోసారి చర్చలోకి వస్తున్నాయి. నిన్న సందీప్ కిషన్ ‘పవర్ పేట’ టీజర్ వచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య ఇది రాసుకున్నది నితిన్ కోసమే. అయితే ఆయన డైరెక్ట్ చేసిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఫ్లాప్ అయ్యాక అడుగులు ముందుకు పడలేదు.
ఆనంద్ దేవరకొండ చేసిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ తొలుత నితిన్ దగ్గరికే వెళ్ళింది. సితార సంస్థ కన్నా ముందు స్వంత బ్యానర్ లో తెరకెక్కించేందుకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. దిల్ రాజు నిర్మాతగా వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అంతా ఓకే అనుకున్న తర్వాత తమ్ముడు ఫలితం ఈ కాంబోని ఆపేసింది. ఊహించని విధంగా నితిన్ ప్లేస్ లో దేవీశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కావడం అసలు ట్విస్ట్.
పైన చెప్పిన మూడు సబ్జెక్టులు విశ్లేషించుకుంటే నితిన్ మూడు నిర్ణయాలు సరైనవే అనిపిస్తుంది. పవర్ పేటలో ఉండే ఓవర్ మాస్ తనకు అంతగా సూట్ కాదు. ప్రస్థానం నుంచి రాయన్ దాకా సందీప్ కిషన్ ఇలాంటి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేశాడు కాబట్టి ఈజీగా నెట్టుకొస్తాడు ఇక ఎపిక్ లో కాలేజీ కుర్రాడిగా ఆనంద్ దేవరకొండ సరిపోతాడు కానీ నలభై వయసు దాటిన నితిన్ తో ఇప్పుడు లిప్ లాక్స్ పెట్టడం అంతగా సెట్ కాదు. అది కూడా యుకె బ్యాక్ డ్రాప్ లో.
ఇక ఎల్లమ్మలో దేవి గెటప్ చూశాక కొత్తవాళ్ళైతేనే ఇలాంటి క్యారెక్టర్స్ పండుతాయనే అభిప్రాయానికి బలం చేకూరింది. కారణాలు ఏమైనా, నితిన్ వీటిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చినా అంతా మన మంచికే అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. కొంచెం లేట్ అయినా పర్లేదు సరైన హిట్ రావాలన్న సంకల్పంతో నితిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగా విఐ ఆనంద్ తో ప్లాన్ చేసిన ఫాంటసీ మూవీ కొంత ఆలస్యంగా మొదలుపెడతారని టాక్.
2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు…
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…