వరస డిజాస్టర్ల దెబ్బకు కొంత బ్రేక్ తీసుకున్న నితిన్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెడుతున్నాడు. డెబ్యూ దర్శకులను నమ్మి ఇటీవలే కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే గతంలో వదులుకున్న ప్రాజెక్టుల విషయాలు ఇప్పుడు మరోసారి చర్చలోకి వస్తున్నాయి. నిన్న సందీప్ కిషన్ ‘పవర్ పేట’ టీజర్ వచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య ఇది రాసుకున్నది నితిన్ కోసమే. అయితే ఆయన డైరెక్ట్ చేసిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఫ్లాప్ అయ్యాక అడుగులు ముందుకు పడలేదు.
ఆనంద్ దేవరకొండ చేసిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ తొలుత నితిన్ దగ్గరికే వెళ్ళింది. సితార సంస్థ కన్నా ముందు స్వంత బ్యానర్ లో తెరకెక్కించేందుకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. దిల్ రాజు నిర్మాతగా వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అంతా ఓకే అనుకున్న తర్వాత తమ్ముడు ఫలితం ఈ కాంబోని ఆపేసింది. ఊహించని విధంగా నితిన్ ప్లేస్ లో దేవీశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కావడం అసలు ట్విస్ట్.
పైన చెప్పిన మూడు సబ్జెక్టులు విశ్లేషించుకుంటే నితిన్ మూడు నిర్ణయాలు సరైనవే అనిపిస్తుంది. పవర్ పేటలో ఉండే ఓవర్ మాస్ తనకు అంతగా సూట్ కాదు. ప్రస్థానం నుంచి రాయన్ దాకా సందీప్ కిషన్ ఇలాంటి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేశాడు కాబట్టి ఈజీగా నెట్టుకొస్తాడు ఇక ఎపిక్ లో కాలేజీ కుర్రాడిగా ఆనంద్ దేవరకొండ సరిపోతాడు కానీ నలభై వయసు దాటిన నితిన్ తో ఇప్పుడు లిప్ లాక్స్ పెట్టడం అంతగా సెట్ కాదు. అది కూడా యుకె బ్యాక్ డ్రాప్ లో.
ఇక ఎల్లమ్మలో దేవి గెటప్ చూశాక కొత్తవాళ్ళైతేనే ఇలాంటి క్యారెక్టర్స్ పండుతాయనే అభిప్రాయానికి బలం చేకూరింది. కారణాలు ఏమైనా, నితిన్ వీటిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చినా అంతా మన మంచికే అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. కొంచెం లేట్ అయినా పర్లేదు సరైన హిట్ రావాలన్న సంకల్పంతో నితిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగా విఐ ఆనంద్ తో ప్లాన్ చేసిన ఫాంటసీ మూవీ కొంత ఆలస్యంగా మొదలుపెడతారని టాక్.
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…