దేవిశ్రీ ప్రసాద్ను హీరోగా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతుండగా.. గత ఏడాదే అతను నటుడిగా తన తొలి చిత్రానికి ఓకే చెప్పాడు. అది కూడా ఎవరో చేయాల్సిన ‘యల్లమ్మ’ సినిమాను అతను టేకప్ చేశాడు. ‘బలగం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ వేణు యల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ సినిమాలో కథానాయిక విషయమై కొన్నేళ్ల ముందు నుంచి రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి.
‘యల్లమ్మ’లో ముందు నానిని హీరోగా అనుకున్నారు. అప్పుడు కీర్తి సురేష్ పేరు వినిపించింది. తర్వాత హీరో స్థానంలోకి నితిన్ వచ్చాక కూడా కీర్తి పేరే ప్రచారంలో ఉంది. ఐతే దేవిశ్రీ ప్రసాద్ లీడ్ రోల్కు కన్ఫమ్ అయ్యాక కీర్తి పేరు పక్కకు వెళ్లిపోయింది. సాయిపల్లవి ఇందులో కథానాయికగా నటించొచ్చని రూమర్లు వినిపించాయి. కానీ ఆమె ఈ సినిమాను ఓకే చేసేంత ఖాళీగా లేదు.
తాజా సమాచారం ప్రకారం ‘యల్లమ్మ’లో మృణాల్ ఠాకూర్ నటించబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మృణాల్కు బాలీవుడ్లో గ్లామర్ ఇమేజ్ ఉంది కానీ.. తెలుగులో మాత్రం ఆమె పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేస్తోంది. ‘సీతారామం’లో సీత పాత్రతో వచ్చిన గుర్తింపుకు తగ్గట్లే ఆమె నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకుంటోంది. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్, డెకాయిట్.. ఈ చిత్రాల వరస చూస్తే అర్థమవుతుంది.
‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్ అయినా సరే.. అందులో కూడా ఆమెది కథలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రే.
‘యల్లమ్మ’లో దేవి సరసన మృణాల్ నటించడం ఆమె స్థాయికి తగునా అన్న సందేహాలు కలగొచ్చు. కానీ ఈ సినిమాలో కథానాయిక పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని.. పెర్ఫామెన్స్కు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇదని అంటున్నారు.
ఆ కోణంలో ఆలోచించే మృణాల్ ఈ సినిమాను ఓకే చేసి ఉంటుందని భావిస్తున్నారు. ‘బలగం’ చిత్రాన్ని నిర్మించిన అగ్ర నిర్మాత దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మృణాల్ ఈ సినిమా చేస్తుండడం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on May 7, 2026 9:49 pm
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…