2026 బాలీవుడ్ అతి పెద్ద డిజాస్టర్ గా ఏక్ దిన్ నిలవనుంది. మాములుగా అయితే దీని హీరో జునైద్ ఖాన్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోనవసరం లేదు. కానీ హీరోయిన్ సాయిపల్లవి కావడం వల్లే తెలుగులో డబ్బింగ్ చేయడంతో పాటు మీడియాలో ఆమెనే హైలైట్ చేశారు నిర్మాత అమీర్ ఖాన్. ఇంతా చేసి ఆఖరికి దారుణమైన ఫలితం మూటగట్టుకుంది. మితిమీరిన డ్రామాని ఆడియన్స్ భరించలేక మేం థియేటర్లకు వెళ్ళం బాబోయ్ అంటూ యునానిమస్ తీర్పు ఇచ్చేశారు.
తాజాగా సాయిపల్లవి ఈ ఫలితం గురించి స్పందించింది. ఏక్ దిన్ ముందు తన దగ్గరికి వచ్చినప్పుడు వద్దనుకున్నానని, అయితే తనకు బాగా ఇష్టమైన హాలీవుడ్ హిట్ ‘బిఫోర్ సన్ రైజ్’లాగా అనిపించడంతో ఒప్పుకున్నానని చెప్పింది. ముంబైలో స్పెషల్ ప్రీమియర్ షో అయ్యాక కూడా అమీర్ ఖాన్ తో తన బదులు వేరొకరు అయ్యుంటే బెటర్ ఛాయస్ అయ్యేదని, చలాకీగా ఉండే కొత్త అమ్మాయి ఎవరైనా ఇంకా బాగుండేదని, న్యాయం చేసేవారని చెప్పినట్టుగా గుర్తుచేసుకుంది.
ఇదంతా ఇప్పుడు ఓకే కాని చేతులు కాలాక చింతించి ఎలాంటి లాభం లేదు. నిజానికి ఏక్ దిన్ ఓపిగ్గా చూసేందుకు ఒకే ఒక్క కారణం ఏదైనా చెప్పమంటే ఠక్కున సాయిపల్లవి అని చెప్పాలి. అంతగా మీరా పాత్రలో జీవించేసింది. ముందే చెప్పినట్టు భావోద్వేగాలు మరీ తీవ్రంగా ఉండటం, నెరేషన్ నత్త నడకన సాగడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తట్టుకోలేకపోయారు. తెలుగులో ఒక రోజు పేరుతో డబ్బింగ్ చేస్తే ఒక్క ఆటకే జనం నో అనేశారని వసూళ్లు స్పష్టం చేశాయి.
సాయిపల్లవి దీపావళికి రామాయణ రూపంలో అసలైన పరీక్ష ఎదురుకోనుంది. పవిత్ర సీత పాత్రలో ఎంత బాగా చేసి ఉంటుందనే దాని మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ రన్బీర్ కపూర్, యష్ లాంటి టాలెంటెడ్ హీరోస్ మధ్య నటించడమంటే మాటలు కాదు. సీత క్యారెక్టర్ క్లిక్ అయిపోయి సినిమా బ్లాక్ బస్టర్ సాధిస్తే సాయిపల్లవికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఇది కాకుండా ధనుష్ 55వ మూవీలో శ్రీలీలతో పాటు తను మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on May 7, 2026 12:29 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…