ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. నిన్న మైత్రి తరఫున శశి ఏకంగా ఒక ఓపెన్ లెటర్ విడుదల చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. సింగల్ స్క్రీన్స్ తో పంచాయితీ ఉన్నప్పుడు జెట్లీని తమ మల్టీప్లెక్సుల్లో కూడా వేయకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఎట్టకేలకు ఇవాళ్టి నుంచి తాత్కాలికంగా పరిష్కారం చేసుకున్నారు కానీ పూర్తిగా సాల్వ్ కాలేదు.
ఈ సమస్య గురించి మే 8 ఫిలిం ఛాంబర్ లో కీలక సమావేశం జరగనుంది. దీన్ని ఒక కొలిక్కి తెచ్చే ఒత్తిడి పెద్దల మీద ఉంది. ఎందుకంటే జూన్ 4 పెద్ది రిలీజవుతోంది. థియేటర్లకు జనాలు రాక పావు వంతు, సగం ఆక్యుపెన్సీలతో నరకం చూస్తున్న ఎగ్జిబిటర్ల ఆశలన్నీ పెద్ది మీదే ఉన్నాయి. పంతానికి పోయి అది వేసుకోము అంటే ఇటు ప్రొడ్యూసర్లు, అటు డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరూ నష్టపోతారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి శుభం కార్డు వేయాల్సిందే.
గత ఏడాది హరిహర వీరమల్లు సమయంలోనూ ఇలాంటి డిస్కషన్ వచ్చి ఆ సినిమాని బ్యాన్ చేయబోతున్నారనే స్థాయిలో పంపిణీదారులు మీద పుకార్లు వచ్చాయి. చివరికి ఏదోలా టెంపరరీ బ్రేక్ వేసి మమ అనిపించారు. కానీ పెద్ది కేసు వేరే. ప్రీ రిలీజ్ వైబ్ విపరీతమైన పాజిటివ్ గా ఉంది. చాలా ఏరియాలలో పుష్ప 2 నెంబర్లు వస్తాయని ట్రేడ్ ధీమాగా ఉంది. రాత్రి ప్రీమియర్ నుంచి పాజిటివ్ టాక్ వస్తే కనీసం పది రోజులు టికెట్లు దొరకవని అంటున్నారు.
సో రామ్ చరణ్ సినిమాని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఇప్పుడు సింగల్ స్క్రీన్స్ డిమాండ్ చేస్తున్నంత పర్సెంటెజ్ ఇవ్వకపోవచ్చు కానీ ఎంతో కొంత మధ్యే మార్గ పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంది. ఒకవేళ పెద్ది రిలీజ్ కనక జూన్ 25కి వెళ్ళిపోయి ఉంటే ఇంకొంచెం నింపాదిగా ఉండేవాళ్ళేమో కానీ పెద్దికి థియేటర్ అగ్రిమెంట్లు చేయాల్సిన టైంలో పంపకాల పంచాయితీ ఉండకూడదు. నైజాం పరిణామాలని బట్టే ఏపీ కదలికలు ఉండబోతున్నాయి.
This post was last modified on May 2, 2026 3:28 pm
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు…
భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే…