ఓజి హ్యాంగోవర్ గత ఏడాది బాగా ఎంజాయ్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులను ఉస్తాద్ భగత్ సింగ్ దారుణంగా నిరాశ పరచకపోయినా రొటీన్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా ఫెయిలయ్యింది. కంటెంట్ అంతంత మాత్రంగా ఉండటం ఒక దెబ్బ అనుకుంటే పోటీలో ఉన్న దురంధర్ ది రివెంజ్ స్ట్రోక్ గట్టిగా తగలడంతో కోలుకునే అవకాశం లేకుండా పోయింది. కేవలం నెల రోజుల లోపే నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి వచ్చేయడం అందరూ ఊహించిందే.
అయితే థియేటర్లు అంటే ఇంటి దగ్గర ఓడిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ రచ్చ గెలుస్తున్నాడని డిజిటల్ వర్గాల కథనం. రెండు వారాలకు గాను 10.9 మిలియన్ వ్యూ అవర్స్ (వీక్షించిన గంటలు) సాధించి 2026 సంవత్సరానికి నెంబర్ వన్ ఇండియన్ మూవీగా ఆల్రెడీ కొత్త మైలురాయి స్థాపించాడట. ఎంత మంది చూసారనే వ్యూస్ లెక్కలు తీసుకుంటే అవి 4.4 మిలియన్లు ఉంటారని సమాచారం. ఎలా చూసుకున్నా ఒక డిజాస్టర్ మూవీకి ఇది పెద్ద నెంబర్.
ఇంకా రన్ ఉంటుంది కాబట్టి నెల రోజుల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇంత రెస్పాన్స్ రావడానికి కారణం లేకపోలేదు. ఫ్లాప్ టాక్ వల్ల తెలుగు ఆడియన్స్ చాలా మంది థియేటర్స్ కు వెళ్ళలేదు. ఇతర భాషల్లో డబ్బింగ్ చేయడం వల్ల వ్యూస్ మరింత పెరిగే అవకాశం దొరికింది. నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య అనువాదం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అది ప్లస్ అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు.
సరే వినడానికి ఇదంతా బాగానే ఉంది కానీ కేవలం డిజిటల్ వ్యూస్ ఆధారంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడేదో హిట్ సినిమా అయిపోదు. ఎందుకంటే ఇంట్లో చూసే సౌలభ్యం ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయిన సినిమాలు ఓటిటిలో బాగా పే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొన్న ఏడాది ఒక పెద్ద హీరో ఫ్లాప్ మూవీ ఓటిటిలో పే పర్ వ్యూ మోడల్ లో పెడితే 12 కోట్లు వసూలు చేసింది. అందుకే నిర్మాతలు ఓటిటి విషయంలో అంత పట్టుగా ఉండేది.
తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…
ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…
టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…
ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన…
టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల…
రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక…