తమిళనాట ఇప్పుడు సినిమా చర్చలన్నీ ‘మాస్టర్’ చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా-లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన కోలీవుడ్.. ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమాతోనే మళ్లీ థియేటర్లకు, అలాగే ఇండస్ట్రీకి ఊపు వస్తుందని ఆశిస్తోంది. ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా టెంప్ట్ కాని నిర్మాతలు.. ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేసి మళ్లీ కోలీవుడ్ బాక్సాఫీస్కు కళ తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
ఐతే థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ నడిచే సమయానికే తమ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తుండగా.. ఇటీవల తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లందరూ కలిసి విజయ్ను కలిసి సంక్రాంతికి ‘మాస్టర్’ను రిలీజ్ చేసి తమను కాపాడాలని విన్నవించుకున్నారు. అతను కూడా నిర్మాతలతో మాట్లాడి ఆక్యుపెన్సీ సంగతెలా ఉన్నప్పటికీ ‘మాస్టర్’ను సంక్రాంతికి విడుదల చేసేద్దామని చెప్పినట్లు వార్తలొచ్చాయి.
దీంతో నిర్మాతలు జనవరి 13కు ఈ సినిమాను షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు కానీ.. ఇంత కాలం ఎదురు చూసి, వడ్డీల భారం మోసి 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాను విడుదల చేసి రెవెన్యూను తగ్గించుకోవడం అవసరమా అన్న ఆలోచన వారిని వెంటాడుతూనే ఉంది. విజయ్ కూడా ఇదే విషయమై తర్జనభర్జనలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వద్దకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నామని.. థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని అతను సీఎంను విన్నవించాడు. ఐతే ఇందుకు తమిళనాడు సీఎం అంగీకరిస్తాడా అన్నది డౌటే. ఎందుకంటే థియేటర్ల ఆక్యుపెన్సీపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఒకేసారి 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్లే.
This post was last modified on December 28, 2020 2:18 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…