2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్ బస్టర్ లేకపోవడం వాళ్ళ టెన్షన్ కు కారణం. డెకాయిట్ లాంటివి ఒకటి రెండు కమర్షియల్ గా గట్టెక్కినా అన్ని వర్గాలు, అన్ని సెంటర్లు కలెక్షన్లతో హోరెత్తించిన మూవీ లేకపోవడం ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చింది. వచ్చిన చిన్నా చితకా చిత్రాలు ప్రమోషన్లలో హడావిడి చేయడం తప్ప కంటెంట్లో తేలిపోవడం చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి వాక్యూమ్ ని వాడుకునే చొరవ మీడియం బడ్జెట్ సినిమాలు తీసుకోకపోవడం విచారకరం. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కొరియన్ కనకరాజ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రమోషన్లు మొదలుపెట్టారు కానీ రిలీజ్ డేట్ తేల్చలేదు. కారణం ఆశించిన స్థాయిలో ఇంకా థియేటర్ బిజినెస్ పెరగకపోవడమేనని ఇన్ సైడ్ టాక్. ఓటిటి డీల్ కూడా పెండింగ్ ఉందంటున్నారు కానీ నెట్ ఫ్లిక్స్ కొనేసిందనే మాట యూనిట్ నుంచి వినిపిస్తోంది.
దర్శకుడు మేర్లపాక గాంధీ దీన్నో హారర్ కామెడీగా తీర్చిదిద్దారు. కొరియా వెళ్లిన ఆంధ్రుడు చేసే హాస్యంతో ఆద్యంతం నవ్వులు, భయం మిక్స్ అయ్యేలా కాస్త డిఫరెంట్ గా తీశారనే టాక్ వినిపిస్తోంది. నిజానికీ కొరియన్ కనకరాజు కనక ఏప్రిల్ లో వచ్చి ఉంటే క్యాష్ చేసుకునే అవకాశం ఉండేది. పెద్ది వాయిదా పడుతుందని ముందే పసిగట్టి గాయపడ్డ సింహం, జెట్లీ దాన్ని క్యాష్ చేసుకున్నాయి కానీ వరుణ్ తేజ్ బృందం ఆ ఛాన్స్ వాడుకోకపోవడం ట్రాజెడీ.
నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ కి కొరియన్ కనకరాజు సక్సెస్ కావడం కీలకం. ఘాటీ డిజాస్టర్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్న నిర్మాతలు ఫిబ్రవరిలో కపుల్ ఫ్రెండ్లీ రూపంలో డీసెంట్ మూవీ ఇచ్చారు. భారీ వసూళ్లు కాదు కానీ నష్టాలు రాకుండా గట్టెక్కింది. ఎక్కువ బడ్జెట్ పెట్టిన బైకర్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. కలెక్షన్స్ లెక్కలో ఫ్లాపనే అంటున్నారు. సో కొరియన్ కనకరాజు కనక హిట్ అయితే రిలీఫ్ దక్కుతుంది. ఇది సరే కానీ యువి నుంచి విశ్వంభర అప్డేట్ ఎప్పుడు ఇస్తుందో అంతు చిక్కడం లేదు.
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…