స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ రంగంలోనే ఇలాంటి బాల మేధావులు కనిపిస్తుంటారు. జి.వి.ప్రకాష్ కుమార్, అనిరుధ్ రవిచందర్.. కేవలం 18 ఏళ్ల వయసులోనే సంగీత దర్శకులుగా మారి ఎంతటి సంచలనం రేపారో తెలిసిందే. వీరి బాటలోనే సాయి అభ్యంకర్ అనే కుర్రాడు కూడా అంతే చిన్న వయసులో సంగీత దర్శకుడు అయిపోయాడు.
గత ఏడాది ‘డ్యూడ్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అతను.. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీల కలయికలో తెరకెక్కుతున్న ‘రాకా’ లాంటి మెగా మూవీకి మ్యూజిక్ చేస్తున్నాడు. ప్రస్తుతం తన వయసు 21 ఏళ్లే. సీనియర్ గాయకులు టిప్పు, హరిణిల కుమారుడైన ఈ కుర్రాడు.. చిన్నతనంలోనే సంగీతంలోకి అడుగు పెట్టేశాడు. ఆరో తరగతి చదువుతున్నపుడే అతను పాటల కంపోజింగ్ చేశాడట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు.
ఆరో తరగతి అంటే అప్పటికి 11 ఏళ్ల వయసుంటుంది. సంగీతం నేర్చుకున్నా సరే.. వేరే వాళ్ల పాటలు పాడడమో.. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ను ప్లే చేయడేమో చేస్తారు తప్పితే సొంతంగా పాట కంపోజ్ చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. కానీ అభ్యంకర్ అప్పట్లోనే పాటల కంపోజింగ్ మొదలుపెట్టేశాడట. ఇలా పెరిగి పెద్దయ్యే క్రమంలో వెయ్యి పాటల దాకా కంపోజ్ చేసి పక్కన పెట్టుకున్నట్లు అభ్యంకర్ వెల్లడించాడు. కానీ ఈ ట్యూన్స్ వేటినీ తన సినిమాల్లో ఉపయోగించట్లేదని.. ఆయా సినిమాల కథలను అనుసరించి పాటలు చేస్తున్నానని.. తన దగ్గరున్న వెయ్యి పాటలను 60 ఏళ్ల వయసు దాటాక ఉపయోగిస్తానని అతను చెప్పాడు.
‘డ్యూడ్’లో ‘ఊరుం బ్లడ్’ పాటకు తొలి రెండు రోజులు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందని.. కానీ తర్వాత జనాలకు అది ఎక్కుతుందని ముందే ఊహించానని.. అదే జరిగిందని అతనన్నాడు. ‘రాకా’ సినిమా కాన్సెప్ట్ వింటే క్రేజీగా అనిపించిందని.. ఎంతో ఇన్స్పైర్ అయి ట్యూన్స్ కంపోజ్ చేశానని.. ఈ పాటల కోసం ఇంటర్నేషనల్ సింగర్స్ను తీసుకురావాలని చూస్తున్నామని.. తద్వారా తన సినిమా పాటలు అంతర్జాతీయ స్థాయికి వెళ్తాయని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.
మన హీరోలేమో ఏడాదికి ఒక రిలీజ్ ఉండటమే మహా కష్టమైపోయి ప్యాన్ ఇండియా మోజులో ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మనం…
జనవరిలో 'అనగనగా ఒక రాజు' విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని…
టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా…
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్…
సరిగ్గా ఇంకో పదిహేను రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ…
ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యూపీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సిరీస్.. తొలి…