Movie News

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు. రిలీజ్ ఇంకో సంవత్సరం వాయిదా వేస్తూ 2027 జూన్ 11 థియేటర్లలో వస్తున్నామని తారక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ముందు అనుకున్న ప్రకారం చూసుకుంటే ఇప్పటిది మూడో వాయిదా. వచ్చే నెల మే 20 యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ లాంచ్ చేయబోతున్నారు. అందులోనే టైటిల్ రివీల్ ఉంటుంది.

ఇలా జరగడానికి రకరకాల కారణలున్నాయి. విదేశాల్లో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ అక్కడి పరిస్థితుల వల్ల ముందే ఆపేసి తిరిగి రావాల్సి వచ్చింది. ముఖ్యమైన నెగటివ్ పాత్రకు ఓకే అనుకున్న టోవినో థామస్ తీరా శిక్షణ తీసుకుని సెట్స్ లో అడుగు పెట్టే టైంలో తప్పుకున్నాడు. ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వలేకపోవడమే దానికి రీజన్ గా చెప్పుకున్నాడు. తన స్థానంలో ఎవరు వస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా నిర్ధారణ కాలేదు.

ఇది తారక్ అభిమానులకు నిరాశ కలిగించే పరిణామమే, ఎందుకంటే దేవర వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. వార్ 2 హిందీ మూవీ అందులోనూ మల్టీస్టారర్ కావడంతో ఫ్యాన్స్ దాన్ని పట్టించుకోలేదు. కానీ నీల్ ప్రాజెక్టు మీద కొండంత ఆశలున్నాయి. కెజిఎఫ్ తర్వాత తను తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారనే టాక్ హైప్ ని అంతకంత పెంచుతోంది.

సో ఏదైతేనేం ఫ్యాన్స్ అయితే ఇంకో పదిహేను నెలలు ఎదురు చూడక తప్పదు. మే 20 టీజర్ తర్వాత ప్రమోషన్లు ఆపేస్తారు. టైం చాలా ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే ఎలాంటి హడావిడి ఉండదు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది. డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. బర్త్ డే దాకా వెయిట్ చేయాలి.

Kumar

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

57 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

2 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

2 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

3 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

3 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago