Movie News

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు. రిలీజ్ ఇంకో సంవత్సరం వాయిదా వేస్తూ 2027 జూన్ 11 థియేటర్లలో వస్తున్నామని తారక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ముందు అనుకున్న ప్రకారం చూసుకుంటే ఇప్పటిది మూడో వాయిదా. వచ్చే నెల మే 20 యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ లాంచ్ చేయబోతున్నారు. అందులోనే టైటిల్ రివీల్ ఉంటుంది.

ఇలా జరగడానికి రకరకాల కారణలున్నాయి. విదేశాల్లో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ అక్కడి పరిస్థితుల వల్ల ముందే ఆపేసి తిరిగి రావాల్సి వచ్చింది. ముఖ్యమైన నెగటివ్ పాత్రకు ఓకే అనుకున్న టోవినో థామస్ తీరా శిక్షణ తీసుకుని సెట్స్ లో అడుగు పెట్టే టైంలో తప్పుకున్నాడు. ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వలేకపోవడమే దానికి రీజన్ గా చెప్పుకున్నాడు. తన స్థానంలో ఎవరు వస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా నిర్ధారణ కాలేదు.

ఇది తారక్ అభిమానులకు నిరాశ కలిగించే పరిణామమే, ఎందుకంటే దేవర వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. వార్ 2 హిందీ మూవీ అందులోనూ మల్టీస్టారర్ కావడంతో ఫ్యాన్స్ దాన్ని పట్టించుకోలేదు. కానీ నీల్ ప్రాజెక్టు మీద కొండంత ఆశలున్నాయి. కెజిఎఫ్ తర్వాత తను తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారనే టాక్ హైప్ ని అంతకంత పెంచుతోంది.

సో ఏదైతేనేం ఫ్యాన్స్ అయితే ఇంకో పదిహేను నెలలు ఎదురు చూడక తప్పదు. మే 20 టీజర్ తర్వాత ప్రమోషన్లు ఆపేస్తారు. టైం చాలా ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే ఎలాంటి హడావిడి ఉండదు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది. డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. బర్త్ డే దాకా వెయిట్ చేయాలి.

This post was last modified on April 21, 2026 12:02 pm

Share
Show comments
Published by
Kumar
Tags: NTR Neel

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

24 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

27 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

57 minutes ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

4 hours ago