అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు. రిలీజ్ ఇంకో సంవత్సరం వాయిదా వేస్తూ 2027 జూన్ 11 థియేటర్లలో వస్తున్నామని తారక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ముందు అనుకున్న ప్రకారం చూసుకుంటే ఇప్పటిది మూడో వాయిదా. వచ్చే నెల మే 20 యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ లాంచ్ చేయబోతున్నారు. అందులోనే టైటిల్ రివీల్ ఉంటుంది.
ఇలా జరగడానికి రకరకాల కారణలున్నాయి. విదేశాల్లో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ అక్కడి పరిస్థితుల వల్ల ముందే ఆపేసి తిరిగి రావాల్సి వచ్చింది. ముఖ్యమైన నెగటివ్ పాత్రకు ఓకే అనుకున్న టోవినో థామస్ తీరా శిక్షణ తీసుకుని సెట్స్ లో అడుగు పెట్టే టైంలో తప్పుకున్నాడు. ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వలేకపోవడమే దానికి రీజన్ గా చెప్పుకున్నాడు. తన స్థానంలో ఎవరు వస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా నిర్ధారణ కాలేదు.
ఇది తారక్ అభిమానులకు నిరాశ కలిగించే పరిణామమే, ఎందుకంటే దేవర వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. వార్ 2 హిందీ మూవీ అందులోనూ మల్టీస్టారర్ కావడంతో ఫ్యాన్స్ దాన్ని పట్టించుకోలేదు. కానీ నీల్ ప్రాజెక్టు మీద కొండంత ఆశలున్నాయి. కెజిఎఫ్ తర్వాత తను తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారనే టాక్ హైప్ ని అంతకంత పెంచుతోంది.
సో ఏదైతేనేం ఫ్యాన్స్ అయితే ఇంకో పదిహేను నెలలు ఎదురు చూడక తప్పదు. మే 20 టీజర్ తర్వాత ప్రమోషన్లు ఆపేస్తారు. టైం చాలా ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే ఎలాంటి హడావిడి ఉండదు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది. డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. బర్త్ డే దాకా వెయిట్ చేయాలి.
This post was last modified on April 21, 2026 12:02 pm
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…