ప్రతి సంవత్సరం దేశంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే, రిలీజ్ చేసే ఇండస్ట్రీల్లో టాలీవుడ్ ఒకటి. దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ పరిశ్రమలో ఎన్ని సినిమాలు తెరకెక్కుతాయో దాదాపు అదే స్థాయిలో తెలుగులోనూ సినిమాలు తయారవుతుంటాయి.
కొన్నిసార్లు ఏడాదిలో అత్యధిక సినిమాలు తీసిన, రిలీజ్ చేసిన పరిశ్రమగా కూడా టాలీవుడ్ నిలుస్తుంటుంది. గత పదేళ్లలో తెలుగులో ఏ సంవత్సరం కూడా వందకంటే తక్కువ సినిమాలు రిలీజ్ కాకపోవడం గమనార్హం ఈ దశాబ్దం ఏడాదిలో, అంటే 2011లో టాలీవుడ్ నుంచి 120 స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రిలీజ్ కావడం విశేషం. ఆ తర్వాత ఏడాది నుంచి సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది.
2012లో 127 తెలుగు సినిమాలు రిలీజైతే.. 2013లో ఆ సంఖ్య ఒకేసారి 178కి పెరిగింది. 2014లో అనూహ్యంగా ఏకంగా 194 సినిమాలు రిలీజయ్యాయి. ఇది ఇప్పటికీ టాలీవుడ్ రికార్డు. 2015 నుంచి వరుసగా గత అయిదేళ్లలో 172, 181, 177, 171, 193 సినిమాలు రిలీజయ్యాయి.
ఈ ఏడాది ఆరంభంలో ట్రెండ్ చూస్తే ఈసారి పాత రికార్డులు బద్దలవడం, తొలిసారి 200 సినిమాల రిలీజ్తో కొత్త రికార్డు నమోదు కావడం ఖాయమనుకున్నారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రణాళికలన్నీ దెబ్బ తినేశాయి. థియేటర్లలో ఈ ఏడాది మొత్తంలో రిలీజైన సినిమాలు 49 మాత్రమే. మార్చి రెండో వారం తర్వాత థియేట్రికల్ రిలీజ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ నెలలోనే థియేటర్లు తెరుచుకున్నాయి. ఈ నెలలో థియేటర్లలో రిలీజైన స్ట్రెయిట్ తెలుగు సినిమాలు నాలుగైదే. ఈ ఏడాది అటు ఇటుగా మూడు నెలల వ్యవధిలోనే 49 సినిమాలు రిలీజయ్యాయంటే మిగతా 9 నెలల్లో ఈజీగా నంబర్ 150 దాటేసేది. అంటే కరోనా లేకుంటే డబుల్ సెంచరీ సాధ్యమయ్యేదన్నమాటే.
This post was last modified on December 28, 2020 8:07 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…