ప్రతి సంవత్సరం దేశంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే, రిలీజ్ చేసే ఇండస్ట్రీల్లో టాలీవుడ్ ఒకటి. దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ పరిశ్రమలో ఎన్ని సినిమాలు తెరకెక్కుతాయో దాదాపు అదే స్థాయిలో తెలుగులోనూ సినిమాలు తయారవుతుంటాయి.
కొన్నిసార్లు ఏడాదిలో అత్యధిక సినిమాలు తీసిన, రిలీజ్ చేసిన పరిశ్రమగా కూడా టాలీవుడ్ నిలుస్తుంటుంది. గత పదేళ్లలో తెలుగులో ఏ సంవత్సరం కూడా వందకంటే తక్కువ సినిమాలు రిలీజ్ కాకపోవడం గమనార్హం ఈ దశాబ్దం ఏడాదిలో, అంటే 2011లో టాలీవుడ్ నుంచి 120 స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రిలీజ్ కావడం విశేషం. ఆ తర్వాత ఏడాది నుంచి సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది.
2012లో 127 తెలుగు సినిమాలు రిలీజైతే.. 2013లో ఆ సంఖ్య ఒకేసారి 178కి పెరిగింది. 2014లో అనూహ్యంగా ఏకంగా 194 సినిమాలు రిలీజయ్యాయి. ఇది ఇప్పటికీ టాలీవుడ్ రికార్డు. 2015 నుంచి వరుసగా గత అయిదేళ్లలో 172, 181, 177, 171, 193 సినిమాలు రిలీజయ్యాయి.
ఈ ఏడాది ఆరంభంలో ట్రెండ్ చూస్తే ఈసారి పాత రికార్డులు బద్దలవడం, తొలిసారి 200 సినిమాల రిలీజ్తో కొత్త రికార్డు నమోదు కావడం ఖాయమనుకున్నారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రణాళికలన్నీ దెబ్బ తినేశాయి. థియేటర్లలో ఈ ఏడాది మొత్తంలో రిలీజైన సినిమాలు 49 మాత్రమే. మార్చి రెండో వారం తర్వాత థియేట్రికల్ రిలీజ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ నెలలోనే థియేటర్లు తెరుచుకున్నాయి. ఈ నెలలో థియేటర్లలో రిలీజైన స్ట్రెయిట్ తెలుగు సినిమాలు నాలుగైదే. ఈ ఏడాది అటు ఇటుగా మూడు నెలల వ్యవధిలోనే 49 సినిమాలు రిలీజయ్యాయంటే మిగతా 9 నెలల్లో ఈజీగా నంబర్ 150 దాటేసేది. అంటే కరోనా లేకుంటే డబుల్ సెంచరీ సాధ్యమయ్యేదన్నమాటే.
This post was last modified on December 28, 2020 8:07 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…