ప్రతి సంవత్సరం దేశంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే, రిలీజ్ చేసే ఇండస్ట్రీల్లో టాలీవుడ్ ఒకటి. దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ పరిశ్రమలో ఎన్ని సినిమాలు తెరకెక్కుతాయో దాదాపు అదే స్థాయిలో తెలుగులోనూ సినిమాలు తయారవుతుంటాయి.
కొన్నిసార్లు ఏడాదిలో అత్యధిక సినిమాలు తీసిన, రిలీజ్ చేసిన పరిశ్రమగా కూడా టాలీవుడ్ నిలుస్తుంటుంది. గత పదేళ్లలో తెలుగులో ఏ సంవత్సరం కూడా వందకంటే తక్కువ సినిమాలు రిలీజ్ కాకపోవడం గమనార్హం ఈ దశాబ్దం ఏడాదిలో, అంటే 2011లో టాలీవుడ్ నుంచి 120 స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రిలీజ్ కావడం విశేషం. ఆ తర్వాత ఏడాది నుంచి సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది.
2012లో 127 తెలుగు సినిమాలు రిలీజైతే.. 2013లో ఆ సంఖ్య ఒకేసారి 178కి పెరిగింది. 2014లో అనూహ్యంగా ఏకంగా 194 సినిమాలు రిలీజయ్యాయి. ఇది ఇప్పటికీ టాలీవుడ్ రికార్డు. 2015 నుంచి వరుసగా గత అయిదేళ్లలో 172, 181, 177, 171, 193 సినిమాలు రిలీజయ్యాయి.
ఈ ఏడాది ఆరంభంలో ట్రెండ్ చూస్తే ఈసారి పాత రికార్డులు బద్దలవడం, తొలిసారి 200 సినిమాల రిలీజ్తో కొత్త రికార్డు నమోదు కావడం ఖాయమనుకున్నారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రణాళికలన్నీ దెబ్బ తినేశాయి. థియేటర్లలో ఈ ఏడాది మొత్తంలో రిలీజైన సినిమాలు 49 మాత్రమే. మార్చి రెండో వారం తర్వాత థియేట్రికల్ రిలీజ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ నెలలోనే థియేటర్లు తెరుచుకున్నాయి. ఈ నెలలో థియేటర్లలో రిలీజైన స్ట్రెయిట్ తెలుగు సినిమాలు నాలుగైదే. ఈ ఏడాది అటు ఇటుగా మూడు నెలల వ్యవధిలోనే 49 సినిమాలు రిలీజయ్యాయంటే మిగతా 9 నెలల్లో ఈజీగా నంబర్ 150 దాటేసేది. అంటే కరోనా లేకుంటే డబుల్ సెంచరీ సాధ్యమయ్యేదన్నమాటే.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…