బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు చూస్తే అసలు డెబ్యూ చేస్తాడా లేదానే అనుమానాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ప్రశాంత్ వర్మ ప్యాన్ ఇండియా మూవీ క్యాన్సిల్ చేశారు. తర్వాత ఒకరిద్దరు దర్శకులు ట్రై చేశారు కానీ పనవ్వలేదు. ఆరేడు సంవత్సరాల క్రితమే నిర్మాత సాయి కొర్రపాటి ‘రానే వచ్చాడు మా రామయ్య’ టైటిల్ తో ఒక కథ కూడా సిద్ధం చేసి ఉంచారు.
ఇవన్నీ ప్రపోజల్ స్టేజిలోనే ఆగిపోయాయి. మరోవైపు బాలయ్య తన మానాన తాను వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనిది సెట్స్ మీద ఉండగా తర్వాత వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదిత్య 999 మ్యాక్స్ పెండింగ్ ఉంది. ఇది క్రిష్ కు ఇవ్వాలా లేక స్వంతంగా డైరెక్ట్ చేసుకోవాలానే డైలమాలో బాలయ్య లేట్ చేస్తున్నారు. తండ్రి ఎన్టీఆర్ అన్ని కాకపోయినా కనీసం ఒకటి రెండు దర్శకత్వం చేయాలనేది బాలకృష్ణ కోరికట.
ఒకవేళ మోక్షజ్ఞకు నటించే ఆసక్తి కనక లేకపోతే అదేదో ముందే చెప్పేస్తే బెటర్. ఫ్యాన్స్ ఎదురు చూడటం మానేస్తారు. ఎందుకంటే నందమూరి మూడో తరంలో ఇప్పటికి పెద్ద స్థాయికి చేరుకుంది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. కళ్యాణ్ రామ్ ఇంకా ఎదురీదుతూనే ఉన్నాడు. జానకిరామ్ అబ్బాయిని ఆ మధ్య వైవిఎస్ చౌదరి గ్రాండ్ గా లాంచ్ చేశారు కానీ తర్వాత షూటింగ్ అప్డేట్స్ లేవు. తీస్తున్నారా లేక బ్రేక్ ఇచ్చారా లాంటి వివరాలు కనుక్కుంటే కుటుంబంలో ఒకరు హఠాత్తుగా కాలం చేయడం వల్ల హోల్డ్ చేశారని, త్వరలోనే తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లానింగ్ లో ఉన్నారని తెలిసింది.
ఏది ఏమైనా ఫ్యాన్స్ కోసమైనా బాలయ్య క్లారిటీ ఇస్తే బెటర్. మోక్షజ్ఞ వయసు ఆల్రెడీ మూడు పదులు దాటింది. ఇప్పుడు స్టార్ వారసులుగా ఉన్న వాళ్ళందరూ దాదాపు పాతిక వయసులోపే తెరంగేట్రం చేశారు. అంత త్వరగా వచ్చినా కూడా ఇరవై, పాతిక సంవత్సరాల్లో ఏ ఒక్కరు పట్టుమని ముప్పై సినిమాలు చేయలేకపోయారు. పరిస్థితులు అలా ఉన్నాయి. మరి మోక్షజ్ఞ ఇంతకన్నా జాప్యం చేయడం భావ్యం కాదని అభిమానులు ఫీలవుతున్నారు. ఏం చేస్తారో చూడాలి మరి.
This post was last modified on April 17, 2026 12:00 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…