తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ ఫిమేల్ ఫోక్ సింగర్ మంగ్లీనే అనడంలో మరో మాట లేదు. చిన్న స్థాయిలో ప్రైవేట్ సాంగ్స్ చేసుకునే అమ్మాయి.. సినిమాల్లో భారీ పారితోషకంతో స్పెషల్ సాంగ్స్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రైవేట్ ఈవెంట్లకు హాజరవ్వాలన్నా.. హీరోయిన్ల రేంజిలో ఆమెకు భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. ఐతే ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన మంగ్లీ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి వస్తుండడమే ఆశ్చర్యం కలిగించే విషయం.
గతంలో ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు.. తీసుకున్న పొలిటికల్ స్టాండ్ విమర్శలకు దారి తీశాయి. ఇక ఆ మధ్య ఆమె హోస్ట్ చేసిన ఒక పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారన్న ఆరోపణలు కలకలం రేపాయి. తాజాగా మంగ్లీ ఓ పెద్ద వివాదంలో చిక్కుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరిట మంగ్లీ, ఇంకో ఇద్దరు కలిసి రూ.10 కోట్లకు మోసం చేసినట్లుగా సుబ్బారావు అనే న్యాయవాది కేసు పెట్టడం కలకలం రేపుతోంది.
తన దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని.. డబ్బుల కోసం అడిగితే యాక్సిడెంట్ చేసి చంపుతానని.. శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని సుబ్బారావు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరు చెప్పని తనతో పాటు దాదాపు 150 మందిని మంగ్లీ బృందం మోసం చేసిందని.. మంగ్లీ సోదరుడు శివ, ప్రముఖ దర్శక నిర్మాత వేణు ఉడుగుల కూడా ఈ కుట్రలో భాగమని బాధితుడు ఆరోపించాడు.
వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని సుబ్బారావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. బీఎన్ఎస్ 351 (2), 352 సెక్షన్ల కింద మంగ్లీ, వేణు ఉడుగుల, శివల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంపై మంగ్లీ, వేణు ఇంకా ఏమీ స్పందించలేదు. దర్శకుడిగా ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ లాంటి మంచి సినిమాలు తీసిన వేణు ఉడుగుల.. నిర్మాతగా మారి ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 11, 2026 3:23 pm
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…