ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ ఎలా ఉన్నా టీమ్ మాత్రం తామో గొప్ప అద్భుతాన్ని చూపించిన ఫీలింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా దర్శకుడు నితేశ్ తివారి ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన కబుర్లు పంచుకున్నారు. ముఖ్యంగా యష్ పోషించిన రావణుడి పాత్ర గురించి ఓ రేంజ్ ఎలివేషన్లు ఇస్తున్నారు. నెగటివ్ కన్నా ఎక్కువగా పాజిటివ్ ఉంటుందని ఊరిస్తున్నారు.
రావణుడిని కేవలం సీతను అపహరించిన కోణంలో కాకుండా తనలో ఉన్న వీరత్వం, సంగీత కళ, శివ భక్తి తత్వం, ప్రజలను చక్కగా పాలించిన వైనం లాంటివి చూపించబోతున్నట్టు చెప్పారు. స్వార్థం, పరస్త్రీ మీద వ్యామోహం మనిషి పతనానికి ఎలా దారి తీస్తాయో ఒక పాఠం రూపంలో ప్రేక్షకులకు వివరిస్తామని అంటున్నారు. కెజిఎఫ్, టాక్సిక్ తర్వాత యష్ ఒప్పుకున్న మూవీ ఇదే. రావణుడిగా అయినా సరే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం నితేశ్ తివారి నేరేషనే.
అయితే రావణుడికి సంబంధించి ఒక గొప్ప క్యారెక్టరైజేషన్ చూపించిన నటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది స్వర్గీయ ఎన్టీఆర్ గురించే. సీతారామకళ్యాణం, భూకైలాస్ లో ఆయన చూపించిన వేరియేషన్లు వాటిని మరపురాని మాస్టర్ పీసెస్ గా చేశాయి. తర్వాత సంపూర్ణ రామాయణంలో ఎస్వి రంగారావు రావణుడిగా ప్రాణ ప్రతిష్ట చేశారు. తర్వాత ఇంకెవరు ఈ స్థాయిలో ప్రభావం చూపించిన నటులు లేరు. ఆదిపురుష్ లో సైఫ్ అలీఖాన్ ని గుర్తు చేసుకోకపోవడం ఉత్తమం.
సో రామాయణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పోలికలు వస్తాయి. యష్ లోని అసలైన నటుడిని కూడా ఈ సందర్భంగానే బయటికి తీయొచ్చు. ఒకవేళ ఒకనాటి క్లాసిక్స్ ని గుర్తు చేసే స్థాయిలో కనక యాక్టింగ్ చేయగలిగితే అవార్డులకు ఆకాశమే హద్దు అవుతుంది. నితేశ్ తివారి అంత గొప్పగా పాత్ర చిత్రణ చేశారా లేదానేది ఇక్కడ కీలకం కానుంది. ఏఆర్ రెహమాన్, జిమ్స్ హ్యామర్ సంగీతం సమకూరుస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ లో రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్నారు.
This post was last modified on April 7, 2026 12:42 pm
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని…